ప్రధాని నరేంద్రమోదీతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ
- May 10, 2017
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రధానికి నివేదించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు అయ్యేలా తక్షణమే పరిష్కారం చూపాలని వైఎస్ జగన్...ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, మిర్చి రైతుల సమస్యలు, పోలవరం ప్రాజెక్టు, రాజధానికి సాయం, పార్టీ ఫిరాయించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు కేబినెట్లో స్థానం కల్పించడం తదితర అంశాలను వైఎస్ జగన్... ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రధానిని కలిసినవారిలో వైఎస్ జగన్తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి,మిథున్ రెడ్డి ఉన్నారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









