సబ్సిడీ ఎత్తివేతతో కుదేలైన మీట్ మార్కెట్
- October 05, 2015
మార్కెట్లో మీట్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మీట్పై సబ్సిడీ ఎత్తివేయడంతో మార్కెట్లో అమాంతం మీట్ ధరలు పెరిగిపోయాయి. ఒక్క బహ్రెయినీ దినార్కే కిలో మీట్ ఐదు రోజుల క్రితం లభిస్తే, దాని ధర ఇప్పుడు 3.2 బహ్రెయినీ దినార్లకు చేరుకుందనీ, దాంతో వినియోగదారులు మీట్ని కొనడానికి రావడంలేదని వ్యాపారులు చెప్పారు. 50 రోజులుగా మీట్ వ్యాపారం చేస్తున్న అబు జాబర్, ప్రతిజూ 15 నుంచి 20 గొర్రెలను కొనుగోలు చేసేవాడిననీ, ఇప్పుడు 2 నుంచి మూడు గొర్రెల్ని మాత్రమే తీసుకొచ్చాననీ, వాటి మాంసం కూడా మిగిలిపోతోందని చెప్పాడు. చికెన్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఆవు మాంసం ధర కూడా అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. వ్యాపారుల ఈ సంక్షోభం నుంచి బయటపడెదెలా? అని ఆవేదన చెందుతున్నారు. పాలకులు కల్పించుకుని, సమస్యకు పరిష్కారం వెతకాలని వ్యాపారులు కోరుతున్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







