సబ్సిడీ ఎత్తివేతతో కుదేలైన మీట్ మార్కెట్
- October 05, 2015
మార్కెట్లో మీట్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మీట్పై సబ్సిడీ ఎత్తివేయడంతో మార్కెట్లో అమాంతం మీట్ ధరలు పెరిగిపోయాయి. ఒక్క బహ్రెయినీ దినార్కే కిలో మీట్ ఐదు రోజుల క్రితం లభిస్తే, దాని ధర ఇప్పుడు 3.2 బహ్రెయినీ దినార్లకు చేరుకుందనీ, దాంతో వినియోగదారులు మీట్ని కొనడానికి రావడంలేదని వ్యాపారులు చెప్పారు. 50 రోజులుగా మీట్ వ్యాపారం చేస్తున్న అబు జాబర్, ప్రతిజూ 15 నుంచి 20 గొర్రెలను కొనుగోలు చేసేవాడిననీ, ఇప్పుడు 2 నుంచి మూడు గొర్రెల్ని మాత్రమే తీసుకొచ్చాననీ, వాటి మాంసం కూడా మిగిలిపోతోందని చెప్పాడు. చికెన్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఆవు మాంసం ధర కూడా అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. వ్యాపారుల ఈ సంక్షోభం నుంచి బయటపడెదెలా? అని ఆవేదన చెందుతున్నారు. పాలకులు కల్పించుకుని, సమస్యకు పరిష్కారం వెతకాలని వ్యాపారులు కోరుతున్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







