విద్యార్థిని పాఠశాలలో తీవ్రంగా కొట్టి...నేలను కడిగించారని ఆరోపణ

- May 10, 2017 , by Maagulf
విద్యార్థిని పాఠశాలలో తీవ్రంగా కొట్టి...నేలను కడిగించారని  ఆరోపణ

 చదువులు భోధిస్తారని  బడులకు పంపుతుంటే ..పిల్లల స్వల్ప కారణాలు చూపి వళ్ళు హూనమయ్యేలా నిత్యం బడితే పూజ చేస్తున్నారని అంతేకాక పిల్లవాడి చేత పాఠశాల ఆవరణలోని నేలను  కడిగిస్తున్నారని ఓ  9 ఏళ్ల బాలుడిని తల్లి లబోదిమంటుంది. మాట విననందుకు పిల్లలతో ఆ విధంగా చేస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.   పిల్లలతో పనులు చేయిస్తూ దుర్వినియోగంకు పాల్పడుతున్నారని అందుకు సాక్ష్యంగా  సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఒక వీడియోను ఇటీవల ప్రాచుర్యమయ్యంది.. ప్రస్తుతం ఆ మహిళ తన కుమారుడి పట్ల పాఠశాల యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఏకంగా ఆ ఫిర్యాదును నేరుగా  వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రధాన మంత్రి మరియు  దుబాయ్ పాలకుడు  షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దృష్టికి ఈ విషయంను త్వరలో తీసుకువెళ్లనున్నట్లు తెలిసింది.మహిళ విద్య మంత్రిత్వశాఖను మరియు దుబాయ్ పోలీస్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ను సైతం ఆమె సంప్రదించింది.ఆమె విద్య మంత్రిత్వశాఖకు, మంత్రి పదవికి కూడా వెళ్ళినప్పటికీ, అతన్ని కలవటానికి అనుమతించబడలేదు మరియు మంత్రిత్వ వెబ్సైట్ ద్వారా తన ఫిర్యాదును సమర్పించాలని ఆమె   దుబాయ్ పోలీసు మానవ హక్కుల శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ అల్ ముర్ర్ మాట్లాడుతూ, ఈ అంశంపై మానవ హక్కుల శాఖకు ఆ మహిళ  ఎన్నడూ సంప్రదించలేదని, ఆమె  ఒక వెళ్లి ఉంటె ఆమెకు ఒక మంచి పరిష్కారం లభ్యమయ్యేదని  మంగళవారం ఆయన చెప్పారు. గతంలో ఆమె  పిల్లలు కూడా అదే పాఠశాలలో చదువుతున్నారని వారికి  ఏవైనా సమస్యలు లేవని ఆమె తెలిపింది. ఇపుడు తన చిన్న బిడ్డతోనే  ఇబ్బందులు గత రెండున్నర నెలల క్రితం ప్రారంభమయ్యాయని ఆ తల్లి వాపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com