మే 15 వ తేదీన వైట్‌హౌస్‌లో ట్రంప్ ను కలవనున్న అబుదాబి క్రౌన్ ప్రిన్స్

- May 10, 2017 , by Maagulf
మే 15 వ తేదీన వైట్‌హౌస్‌లో ట్రంప్ ను  కలవనున్న అబుదాబి క్రౌన్ ప్రిన్స్

 అమెరికాలోని వైట్ హౌస్ లో వచ్చే సోమవారం ( మే 15 న ) అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహ్మద్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలవనున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి సీన్ స్పీసర్ తెలిపారు. ఈ సమావేశం ద్వారా మధ్యప్రాచ్య దేశాలలోని తన కీలక భాగస్వాములతో అమెరికా తన సహకారాన్ని మరింత బలపరచనుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన వైట్ హౌస్ లో అబుదాబి రాజు, యుఏఈ సాయుధ దళాల డిఫ్యూటీ కమాండర్  శ్రీశ్రీ  షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు  గౌరవ ఆతిథ్యం ఇవ్వనున్నారు. సౌదీ అరేబియాలో ప్రారంభం కానున్న ట్రంప్ తన మొట్టమొదటి అధికార  విదేశీ పర్యటనకు ముందే ఈ సమావేశం జరగనుంది. మధ్యప్రాచ్యంలో శాంతి ప్రోత్సహించడానికి మరియు ప్రాంతం నుండి డాష్ను వేరుచేయడానికి అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు.  ఉగ్రవాదుల ఏరివేతలో గల్ఫ్‌దేశాల సహాయం కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. తన మొదటి విదేశీ పర్యటన గల్ఫ్‌దేశాలలోనే కొనసాగనుందని ఆయ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్‌దేశాల మైత్రి కోసం ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నారో స్పష్టమవుతోంది. ట్రంప్ పర్యటనకు ముందే అమెరికాలో కీలక భేటీ జరగబోతోంది. అబుదాబి రాజు, యుఏఈ సాయుధ దళాల డిఫ్యూటీ కమాండర్ మహమ్మద్ బిన్ జాయేద్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌తో సోమవారం భేటీ కానున్నారు. వైట్‌హౌస్‌లో కొనసాగనున్న ఈ భేటీలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు, ఉగ్రవాదంపై పోరులో సహకారం తదితర పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నారని వైట్‌హౌస్ అధికారులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com