ధనుష్‌, అమలాపాల్‌ జంటగా 'వీఐపీ 2' జులై 28న విడుదల

- May 10, 2017 , by Maagulf
ధనుష్‌, అమలాపాల్‌ జంటగా 'వీఐపీ 2'  జులై 28న విడుదల

రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో ధనుష్‌, అమలాపాల్‌ జంటగా నటించిన చిత్రం ‘వీఐపీ 2’. ‘వేలైయిల్లా పట్టధారి 2’కి ఇది సంక్షిప్తరూపం. 2014లో ధనుష్‌, అమలాపాల్‌ ప్రధానపాత్రల్లో నటించి ఘనవిజయం సాధించిన చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ చిత్రానికి ధనుష్‌ కథ, సంభాషణలు రాయగా ధనుష్‌కు చెందిన ఉండర్‌బార్‌ ఫిలిమ్స్‌, కలైపులి ఎస్‌.థాణుకు చెందిన ‘వి’ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళం, తెలుగులలో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో దర్శక నటుడు సముద్రగని, శరణ్య పొన్‌వణ్ణన్‌ తదితరులు ఇతర నటీనటులు. ఈ చిత్రం ద్వారా 20 ఏళ్ల తర్వాత నటి కాజోల్‌ పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల తేదీని ధనుష్‌ తన ట్విట్టర్‌ పేజీలో ప్రకటించారు. జులై 28న చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ధనుష్‌ దర్శకత్వం వహించిన ‘పవర్‌ పాండి’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ‘వీఐపీ 2’ విడుదలపై ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో ధనుష్‌, మేఘ ఆకాశ్‌ జంటగా నటించిన ‘ఎన్నై నోక్కి పాయుం తోట్టా’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉండటం ధనుష్‌ అభిమానులకు రెట్టింపు జోష్‌ను కలిగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com