ధనుష్, అమలాపాల్ జంటగా 'వీఐపీ 2' జులై 28న విడుదల
- May 10, 2017
రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ‘వీఐపీ 2’. ‘వేలైయిల్లా పట్టధారి 2’కి ఇది సంక్షిప్తరూపం. 2014లో ధనుష్, అమలాపాల్ ప్రధానపాత్రల్లో నటించి ఘనవిజయం సాధించిన చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ధనుష్ కథ, సంభాషణలు రాయగా ధనుష్కు చెందిన ఉండర్బార్ ఫిలిమ్స్, కలైపులి ఎస్.థాణుకు చెందిన ‘వి’ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళం, తెలుగులలో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో దర్శక నటుడు సముద్రగని, శరణ్య పొన్వణ్ణన్ తదితరులు ఇతర నటీనటులు. ఈ చిత్రం ద్వారా 20 ఏళ్ల తర్వాత నటి కాజోల్ పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల తేదీని ధనుష్ తన ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. జులై 28న చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ధనుష్ దర్శకత్వం వహించిన ‘పవర్ పాండి’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ‘వీఐపీ 2’ విడుదలపై ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గౌతమ్ మేనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘ ఆకాశ్ జంటగా నటించిన ‘ఎన్నై నోక్కి పాయుం తోట్టా’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉండటం ధనుష్ అభిమానులకు రెట్టింపు జోష్ను కలిగిస్తోంది.
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







