ధనుష్, అమలాపాల్ జంటగా 'వీఐపీ 2' జులై 28న విడుదల
- May 10, 2017
రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ‘వీఐపీ 2’. ‘వేలైయిల్లా పట్టధారి 2’కి ఇది సంక్షిప్తరూపం. 2014లో ధనుష్, అమలాపాల్ ప్రధానపాత్రల్లో నటించి ఘనవిజయం సాధించిన చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ధనుష్ కథ, సంభాషణలు రాయగా ధనుష్కు చెందిన ఉండర్బార్ ఫిలిమ్స్, కలైపులి ఎస్.థాణుకు చెందిన ‘వి’ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళం, తెలుగులలో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో దర్శక నటుడు సముద్రగని, శరణ్య పొన్వణ్ణన్ తదితరులు ఇతర నటీనటులు. ఈ చిత్రం ద్వారా 20 ఏళ్ల తర్వాత నటి కాజోల్ పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల తేదీని ధనుష్ తన ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. జులై 28న చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ధనుష్ దర్శకత్వం వహించిన ‘పవర్ పాండి’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ‘వీఐపీ 2’ విడుదలపై ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గౌతమ్ మేనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘ ఆకాశ్ జంటగా నటించిన ‘ఎన్నై నోక్కి పాయుం తోట్టా’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉండటం ధనుష్ అభిమానులకు రెట్టింపు జోష్ను కలిగిస్తోంది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









