ధనుష్, అమలాపాల్ జంటగా 'వీఐపీ 2' జులై 28న విడుదల
- May 10, 2017
రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ‘వీఐపీ 2’. ‘వేలైయిల్లా పట్టధారి 2’కి ఇది సంక్షిప్తరూపం. 2014లో ధనుష్, అమలాపాల్ ప్రధానపాత్రల్లో నటించి ఘనవిజయం సాధించిన చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రానికి ధనుష్ కథ, సంభాషణలు రాయగా ధనుష్కు చెందిన ఉండర్బార్ ఫిలిమ్స్, కలైపులి ఎస్.థాణుకు చెందిన ‘వి’ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళం, తెలుగులలో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో దర్శక నటుడు సముద్రగని, శరణ్య పొన్వణ్ణన్ తదితరులు ఇతర నటీనటులు. ఈ చిత్రం ద్వారా 20 ఏళ్ల తర్వాత నటి కాజోల్ పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల తేదీని ధనుష్ తన ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. జులై 28న చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ధనుష్ దర్శకత్వం వహించిన ‘పవర్ పాండి’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ‘వీఐపీ 2’ విడుదలపై ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గౌతమ్ మేనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘ ఆకాశ్ జంటగా నటించిన ‘ఎన్నై నోక్కి పాయుం తోట్టా’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉండటం ధనుష్ అభిమానులకు రెట్టింపు జోష్ను కలిగిస్తోంది.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









