డ్రైవర్ మూర్ఛపోతే.... స్టీరింగ్ ను అందుకొని బస్సుని నడిపిన కాలేజ్ అమ్మాయి
- May 11, 2017
సకాలంలో ఆ కాలేజీ అమ్మాయి స్పందించడంతో... ఒక పెద్ద ముప్పు తప్పింది. మంగళవారం హెయిల్ యూనివర్శిటీ అల్-ఘజ్జలా శాఖకు చెందిన బస్సుని డ్రైవర్ నడుపుతూ, ఒక్కసారిగా మూర్ఛ వ్యాధికి గురై స్టీరింగ్ మీద అకస్మాత్తుగా పడిపోయాడు బస్సు కుదుపులకు లోనవుతూ దిగువకుపోతూ ఓ పక్కకు వెళ్ళిపోతుంది ..ఆ క్షణాన ఆ బస్సులో ఉన్న కాలేజీ యువతీలలో ఒక అమ్మాయి వెంటనే డ్రైవర్ వద్దకు పరుగున రావడం వెనువెంటనే స్టీరింగ్ ను చేతబుచ్చుకొని చాకచక్యంగా తిరిగి బస్సుని రోడ్డుపై సమర్ధవంతంగా నడిపి భారీ ప్రమాదం నుంచి అందర్నీ కాపాడింది. తన చర్యతో అందర్నీఆశ్చర్యానికి గురిచేసింది.సాహసోపేతమైన ఆ పనితో బస్సులో తన తోటి యువతులను కాపాడిన ఆమె సమయస్ఫూర్తిని అందరూ కొనియాడుతున్నారు. కళాశాల బాలికలతో ఒకరైన అష్వాఖ్ అల్-షామిరి, అంతటితో ఆగక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ డ్రైవర్ ను తీసుకొని నేరుగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్న ఆన్లైన్ వార్తాపత్రికలో ఒక నివేదికలో తెలిపింది. ప్రైవేటు బస్సులో తరగతులకు వెళ్లిన తర్వాత ఆ అమ్మాయిలు తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారు.యూనివర్సిటీ బ్రాంచ్ లోని బాలికల విభాగం సాధారణ పర్యవేక్షకుడు డా. హానన్ అల్-అమీర్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, డ్రైవర్ యొక్క జీవితాన్ని కాపాడటానికి ఆ విద్యార్థిని చేసిన సాహిస చర్య ఎంతగానో సహాయపడిందని, ఆమె ధైర్యం మరియు మానవతావాద స్ఫూర్తిని ఆయన మెచ్చుకున్నాడు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









