రూమర్స్, విశ్వసనీయత లేని వార్తలపై అప్రమత్తం: మినిస్ట్రీ
- May 11, 2017
రూమర్లను ప్రచారం చేసేవారు, అలాగే విశ్వసనీయత లేని వార్తల్ని ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. సోషల్ మీడియా ద్వారా ఈ తరహా దుష్ప్రచారం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యిందని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. కొన్ని ఘటనలు జరగకపోయినా జరిగాయన్నట్లు ప్రచారం చేయడం, అలాగే పనికట్టుకుని కొందరిపై దుష్ప్రచారం కోసం వార్తల్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం తమ దృష్టికి వచ్చిందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన రూమర్స్, చలానాలపై ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తుండడం పట్ల మినిస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో ఎలాంటి రూమర్స్ కనిపించినా వాటిని సంబంధిత వర్గాలతో ధృవీకరణ చేసుకోవాలి తప్ప, గుడ్డిగా వాటిని షేర్ చేయడం వల్ల లీగల్ చర్యలకు లోనవుతారని మినిస్ట్రీ హెచ్చరించింది
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!









