టుస్సాడ్స్‌లో క్రికెట‌ర్ కపిల్ మైన‌పు విగ్ర‌హం

- May 11, 2017 , by Maagulf
టుస్సాడ్స్‌లో క్రికెట‌ర్ కపిల్ మైన‌పు విగ్ర‌హం

టీమిండియాకు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ అందించిన క్రికెట‌ర్ క‌పిల్‌దేవ్ మైన‌పు విగ్ర‌హాన్ని ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో క‌పిల్ దేవ్ టీమిండియా కెప్టెన్‌గా ఉన్నారు. క‌న్నాట్ ప్లేస్‌లోని రీగ‌ల్ సినిమా స‌మీపంలో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో కపిల్ మైన‌పు విగ్ర‌హాన్ని పెట్టారు. గురువారం జ‌రిగిన వేడుక‌లో మాజీ ఫాస్ట్ బౌల‌ర్ కపిల్ దేవ్ త‌న మైన‌పు బొమ్మ‌ను ఆవిష్క‌రించారు. టుస్సాడ్స్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 23 కేంద్రాలు ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో సుమారు 50 మైన‌పు విగ్ర‌హాలు ఉన్నాయి. క్రీడా, మ్యూజిక్‌, ఫిల్మ్‌, టీవీ సెల‌బ్రిటీలు ఇందులో ఉన్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌, మ‌హాత్మా గాంధీ, జాకీ చాన్‌, స‌చిన్‌, లేడీ గాగా మైన‌పు విగ్ర‌హాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com