మహేష్ 'స్పైడర్' వచ్చేది.. సెప్టెంబర్ లో
- May 11, 2017
మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేష్ 'స్పైడర్' షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఏపీసోడ్ ని చిత్రీకరిస్తున్నారు. రంజాన్ కానుకగా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'స్పైడర్'ని ఆగస్టుకి వాయిదా వేశారు. ఆగస్టు 11న 'స్పైడర్' ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే, ఇప్పుడీ డేట్ కి కూడా 'స్పైడర్' రిలీజ్ కావడం లేదట
తాజా సమాచారమ్ ప్రకారం స్పైడర్ ని ఆగస్టులో కాకుండా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు మురగదాస్ 'స్పైడర్' విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదట.
ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. దాదాపు రూ. 100కోట్ల బడ్జెట్ తో స్పైడర్ తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేయనున్నారు. హిందీలో డబ్ చేసి వదలనున్నారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్. ఎన్.వి ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాతలు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









