సౌదీ ఎయిర్ లైనర్ కు బాంబు బెదిరింపు..హడలిపోయిన ప్రయాణికులు
- May 11, 2017
సౌదీ అరేబియా:మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పలువురికి ముచ్చెమటలు పట్టించాడు.. తన చేతిలో బాంబు ఉందని ఇపుడు ఈ విమానం పేల్చేస్తానంటూ...పెద్దగా కేకలు వేస్తూ, నానా హడావిడి చేయడంతో పలువురు విమాన ప్రయాణికులు హడలిపోయారు. సౌదీ అరేబియా లోని జెడ్డా నుంచి కైరోకు వెళుతున్న సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లయ్నస్ విమానంలో ఈ ఘటన జరగడంతో మంగళవారం విమాన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈజిప్ట్ కు చెందిన వస్త్ర కర్మాగారానికి చెందిన రిటైర్డ్ కాబడిన 61 ఏళ్ల వ్యక్తిని ఈజిప్టు రాజధానిలో ఉన్నపుడు భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఆ వ్యక్తి అసలు తాను ఏమి చేశానో గుర్తు రావడం లేదని పోలీసులతో పేర్కొన్నాడు.దాంతో ఆ వ్యక్తి మానసిక స్థితిని పరీక్షించడానికి ఒక మనోరోగ వైద్యుడి చెంతకు పంపించాలని భావిస్తున్నారు. రాష్ట్ర వార్తాపత్రిక ఆహారంగాతె కధనం ప్రకారం, అదుపులోనికి తీసుకొన్నవ్యక్తి వద్ద ఏ విధమైన ఆయుధాలు కానీ, పేలుడు పదార్ధాలు వంటివి ఏ మాత్రం దొరకలేదని తెలిపింది. ఈజిప్టులో ఈ ఘటన ఎయిర్ సెక్యూరిటీకి సున్నితమైన అంశం కావడంతో వారు అప్రమత్తమైపోయారు గత ఏడాది ఒక ఈజిప్టు విమాన ప్రమాద కారణం ఇప్పటికి తెలియని స్థితిలో మధ్యధరా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో 66 మంది దుర్మరణం చెందారు. అదేవిధంగా 2015 లో ఒక రష్యన్ విమానం సినాయ్పలో దిగింది. ఆ విమానంలోని 224 మంది ప్రయాణికులను డెయిష్ తీవ్రవాద సంస్థ అమానుషంగా కాల్చి చంపింది.. ఆ ఘటనలు ఇంకా మరవని ఈజిప్టు విమాన ప్రయాణికులు మతిస్థిమితం లేనివ్యక్తి హెచ్చరిక విని గజ గజ వణికిపోయారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









