సౌదీ ఎయిర్ లైనర్ కు బాంబు బెదిరింపు..హడలిపోయిన ప్రయాణికులు
- May 11, 2017
సౌదీ అరేబియా:మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పలువురికి ముచ్చెమటలు పట్టించాడు.. తన చేతిలో బాంబు ఉందని ఇపుడు ఈ విమానం పేల్చేస్తానంటూ...పెద్దగా కేకలు వేస్తూ, నానా హడావిడి చేయడంతో పలువురు విమాన ప్రయాణికులు హడలిపోయారు. సౌదీ అరేబియా లోని జెడ్డా నుంచి కైరోకు వెళుతున్న సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లయ్నస్ విమానంలో ఈ ఘటన జరగడంతో మంగళవారం విమాన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈజిప్ట్ కు చెందిన వస్త్ర కర్మాగారానికి చెందిన రిటైర్డ్ కాబడిన 61 ఏళ్ల వ్యక్తిని ఈజిప్టు రాజధానిలో ఉన్నపుడు భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఆ వ్యక్తి అసలు తాను ఏమి చేశానో గుర్తు రావడం లేదని పోలీసులతో పేర్కొన్నాడు.దాంతో ఆ వ్యక్తి మానసిక స్థితిని పరీక్షించడానికి ఒక మనోరోగ వైద్యుడి చెంతకు పంపించాలని భావిస్తున్నారు. రాష్ట్ర వార్తాపత్రిక ఆహారంగాతె కధనం ప్రకారం, అదుపులోనికి తీసుకొన్నవ్యక్తి వద్ద ఏ విధమైన ఆయుధాలు కానీ, పేలుడు పదార్ధాలు వంటివి ఏ మాత్రం దొరకలేదని తెలిపింది. ఈజిప్టులో ఈ ఘటన ఎయిర్ సెక్యూరిటీకి సున్నితమైన అంశం కావడంతో వారు అప్రమత్తమైపోయారు గత ఏడాది ఒక ఈజిప్టు విమాన ప్రమాద కారణం ఇప్పటికి తెలియని స్థితిలో మధ్యధరా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో 66 మంది దుర్మరణం చెందారు. అదేవిధంగా 2015 లో ఒక రష్యన్ విమానం సినాయ్పలో దిగింది. ఆ విమానంలోని 224 మంది ప్రయాణికులను డెయిష్ తీవ్రవాద సంస్థ అమానుషంగా కాల్చి చంపింది.. ఆ ఘటనలు ఇంకా మరవని ఈజిప్టు విమాన ప్రయాణికులు మతిస్థిమితం లేనివ్యక్తి హెచ్చరిక విని గజ గజ వణికిపోయారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









