ఇకపై `మా` తక్షణ సహాయం 2లక్షలు!
- May 11, 2017`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంఘం) మెంబర్ల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇటీవల శివాజీ రాజా అధ్యక్షతన ఏర్పాటైన నూతన కార్యవర్గం `మా` అభివృద్ధిలో భాగంగా కొత్త కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది.
`మా` టీమ్ లో ఆర్ధికంగా వెనుకబడిన వారు చనిపోయినప్పుడు దహన సంస్కార కార్యక్రమాలు నిమిత్తం కొంత అమౌంట్ ను అప్పటికప్పుడు ఉరు కులు..పరుగులు మీద అందించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్థి పలుకుతు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. మా టీమ్ లో మెంబర్ పేరిట ఉన్న డెత్ ఇన్స్ రెన్స్ క్లైమ్ క్రింద తక్షణం 2 లక్షల రూపాయలను చనిపోయిన రోజునే అందించడం జరుగుతుందని `మా` అధ్యక్షులు శివాజీ రాజా తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ` `మా`తో 20 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఇన్నేళ్ల అనుభవంలో ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. మా మెంబర్లలో ఎవరైనా పేద కళా కారులు చనిపోయినప్పుడు ఆ సమయంలో దహన సంస్కార కార్యక్రమాలు సైతం పూర్తి చేయలేని స్థితిలో ఉంటున్నారు. అలాంటి సమయంలో `మా` నుంచి 5000, 10000 రూపాయల ఆర్ధిక సహాయం అందేది. అయితే ఇకపై అలా కాకుండా తక్షణ పరిష్కారంగా 2 లక్షల రూపాయలను వెంటనే అందించడం జరుగుతుంది. తర్వాత మెంబర్ పేరిట ఉన్న 2 లక్షల ఇన్సురెన్స్ క్లైమ్ ను `మా` లో జమ చేసుకుంటాం` అని తెలిపారు.
కొత్తగా ఏర్పాటైన `మా` టీమ్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని `మా` మాజీ అధ్యక్షులు మురళీ మోహన్ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









