గత నెలలో హజ్ యాత్ర తొక్కిసలాటలో 74 మంది భారతీయలు మృతి

- October 06, 2015 , by Maagulf
గత నెలలో హజ్ యాత్ర తొక్కిసలాటలో 74 మంది భారతీయలు మృతి

గత నెలలో హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా మృతిచెందిన వారి సంఖ్య రోజుకోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ భారత్ కు చెందిన యాత్రికులు 74 మంది మృతిచెందినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆదివారం నాటికి ఈ మృతుల సంఖ్య 58గా ఉండేది. మీనాలో జరిగిన హజ్ యాత్ర తొక్కిసలాట మృతుల పేర్లను ఇండియన్ కాన్సులేట్ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసినట్లు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. మక్కాలో సెప్టెంబర్ 24న జరిగిన ఈ దుర్ఘటన కారణంగా ఇప్పటివరకు వెయ్యికిపైగా మృతిచెందిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com