మరో నటవారసున్నిపరిచయం చేస్తున్నా పూరి

- October 06, 2015 , by Maagulf
మరో నటవారసున్నిపరిచయం చేస్తున్నా పూరి

చిరుత సినిమాతో మెగాస్టార్ చిరంజీవి నటవారసున్ని పరిచయం చేసిన పూరి జగన్నాథ్ తాజాగా మరో నటవారసున్ని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. చిరు 150వ సినిమాకు పూరి దర్శకత్వం అన్న వార్తలు, ఊహాగానాలకు తెరపడిన నేపథ్యంలో తన జెట్ స్పీడ్ వేగాన్ని తిరిగి కొనసాగించే పనిలో పూరి పడ్డాడు. ప్రస్తుతం వరుణ్‌తేజ్ హీరోగా లోఫర్ సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ, ఆ సినిమా పూర్తికాకముందే తన తదుపరి సినిమాను ట్విట్టర్ ద్వారా ప్రకటించేశాడు. సినిమాకు 'రోగ్' అనే పేరును పెట్టాడు. పోకిరి సీక్వెల్‌గా ఈసినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. రోగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఇషాన్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. తెలుగులో మహాత్మలాంటి సక్సెస్‌పుల్ చిత్రాన్ని నిర్మించిన కన్నడ నిర్మాత,నటుడు సీఆర్ మనోహర్ తనయుడే ఈ ఇషాన్. నవంబర్‌లో చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com