మరో నటవారసున్నిపరిచయం చేస్తున్నా పూరి
- October 06, 2015
చిరుత సినిమాతో మెగాస్టార్ చిరంజీవి నటవారసున్ని పరిచయం చేసిన పూరి జగన్నాథ్ తాజాగా మరో నటవారసున్ని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. చిరు 150వ సినిమాకు పూరి దర్శకత్వం అన్న వార్తలు, ఊహాగానాలకు తెరపడిన నేపథ్యంలో తన జెట్ స్పీడ్ వేగాన్ని తిరిగి కొనసాగించే పనిలో పూరి పడ్డాడు. ప్రస్తుతం వరుణ్తేజ్ హీరోగా లోఫర్ సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ, ఆ సినిమా పూర్తికాకముందే తన తదుపరి సినిమాను ట్విట్టర్ ద్వారా ప్రకటించేశాడు. సినిమాకు 'రోగ్' అనే పేరును పెట్టాడు. పోకిరి సీక్వెల్గా ఈసినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. రోగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఇషాన్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. తెలుగులో మహాత్మలాంటి సక్సెస్పుల్ చిత్రాన్ని నిర్మించిన కన్నడ నిర్మాత,నటుడు సీఆర్ మనోహర్ తనయుడే ఈ ఇషాన్. నవంబర్లో చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







