మీలో ఎవరు కోటీశ్వరుడినుంచి తప్పుకుంటున్నమెగాస్టార్ చిరంజీవి
- May 12, 2017
మా టీవీలో ఒకప్పుడు అద్భుతంగా రన్నయిన టీవీ షో కార్యక్రమం ఇది. నాగార్జున హోస్ట్గా ప్రారంభించి మూడు సీజన్లను సక్సెస్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు, ఇప్పుడు చిరంజీవితో రన్ చేస్తున్నారు. అయితే నాగార్జున హోస్ట్గా ఉన్నప్పుడే విమర్శలనెదుర్కున్న ఈ షో టీ ఆర్పీ రేటింగ్స్ని ఆశించిన స్థాయిలో పెరగలేదు. చిరంజీవి హోస్ట్గా మొదలు పెట్టాక మొదట్లో అద్భుతంగా రన్నయింది. తాజాగా చిరంజీవి హోస్ట్గా షో మొదలయ్యాక వాట్సాప్లో ఈ షో మీద నెగెటివ్ ప్రచారం మరింత ఎక్కువైంది. సెలబ్రిటీలను పిలిపించి జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసినా క్లిక్ అవ్వకపోయేసరికి చిరంజీవికి, నిర్వాహకులకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. చిరంజీవి బుల్లితెర ఎంట్రీ సక్సెస్ అవుతుందని అనుకుంటే, ఆరంభం నుంచే ఇది డిజాస్టర్ దిశగా సాగింది. ఆల్రెడీ బోర్ కొట్టేసిన కాన్సెప్ట్ని తీసుకుని చిరంజీవి టెలివిజన్ రంగంలోకి రావడం పెద్ద మిస్టేక్ అయింది. ఎన్ని విధాలుగా టీఆర్పీలు పెంచడానికి చూసినా కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు ఏ దశలోను పుంజుకోలేకపోయింది. అయితే మొదటి సీజన్ పూర్తి చేయడం బాధ్యతగా తీసుకుని చిరంజీవి దానిని కొనసాగించారు. ఈ నెలతో మొదటి సీజన్ పూర్తవుతుంది. నిజానికి సెప్టెంబర్లో మళ్లీ సీజన్ స్టార్ట్ చేయాల్సి వుంది కానీ అది ఇక జరగదని అంటున్నారు.
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







