మీలో ఎవరు కోటీశ్వరుడినుంచి తప్పుకుంటున్నమెగాస్టార్ చిరంజీవి

- May 12, 2017 , by Maagulf
మీలో ఎవరు కోటీశ్వరుడినుంచి తప్పుకుంటున్నమెగాస్టార్ చిరంజీవి

మా టీవీలో ఒకప్పుడు అద్భుతంగా రన్నయిన టీవీ షో కార్యక్రమం ఇది. నాగార్జున హోస్ట్‌గా ప్రారంభించి మూడు సీజన్లను సక్సెస్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు, ఇప్పుడు చిరంజీవితో రన్ చేస్తున్నారు.  అయితే నాగార్జున హోస్ట్‌గా ఉన్నప్పుడే విమర్శలనెదుర్కున్న ఈ షో టీ ఆర్పీ రేటింగ్స్‌ని ఆశించిన స్థాయిలో పెరగలేదు. చిరంజీవి హోస్ట్‌గా మొదలు పెట్టాక మొదట్లో అద్భుతంగా రన్నయింది.  తాజాగా చిరంజీవి హోస్ట్‌గా షో మొదలయ్యాక వాట్సాప్‌లో ఈ షో మీద నెగెటివ్ ప్రచారం మరింత ఎక్కువైంది.  సెలబ్రిటీలను పిలిపించి జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసినా క్లిక్ అవ్వకపోయేసరికి చిరంజీవికి, నిర్వాహకులకి ఏం చేయాలో పాలుపోవడం లేదు.  చిరంజీవి బుల్లితెర ఎంట్రీ సక్సెస్‌ అవుతుందని అనుకుంటే, ఆరంభం నుంచే ఇది డిజాస్టర్‌ దిశగా సాగింది. ఆల్రెడీ బోర్‌ కొట్టేసిన కాన్సెప్ట్‌ని తీసుకుని చిరంజీవి టెలివిజన్‌ రంగంలోకి రావడం పెద్ద మిస్టేక్‌ అయింది. ఎన్ని విధాలుగా టీఆర్పీలు పెంచడానికి చూసినా కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు ఏ దశలోను పుంజుకోలేకపోయింది. అయితే మొదటి సీజన్‌ పూర్తి చేయడం బాధ్యతగా తీసుకుని చిరంజీవి దానిని కొనసాగించారు.  ఈ నెలతో మొదటి సీజన్‌ పూర్తవుతుంది. నిజానికి సెప్టెంబర్‌లో మళ్లీ సీజన్‌ స్టార్ట్‌ చేయాల్సి వుంది కానీ అది ఇక జరగదని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com