స్కూల్ బస్లను వినియోగించే విద్యార్థుల్లో 133 శాతం పెరుగుదల
- May 12, 2017
దుబాయ్: స్కూల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసు బస్సుల్ని వినియోగించే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. గతంలో 3,000గా ఉన్న ఈ సంఖ్య ఈ ఏడాది 7,000 వరకు చేరుకుందని ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ తెలిపాయి. దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి), రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది 133 శాతం అదనంగా విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ సర్వీసులను వినియోగించుకుంటున్నారని తేలింది. స్కూల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్పై విద్యార్థులు, తల్లిదండ్రులకున్న నమ్మకాన్ని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని అధికారులు తెలిపారు. స్కూల్ బస్సులపై వేగానికి సంబంధించిన సమాచారం ఉంచడం, అలాగే బస్సుకి ఓ సూపర్వైజర్ని ఏర్పాటు చేయడం, బస్సులకు సర్వైలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేయడం, వంటి చర్యల ద్వారా బస్సుల్ని, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫ్రెండ్లీగా మార్చారు. జిపిఎస్ బస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పేరెంట్స్, తమ పిల్లలు ప్రయాణిస్తున్న బస్ ఎక్కడుందో తెలుసుకునే అవకాశం కలుగుతోంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







