స్కూల్ బస్లను వినియోగించే విద్యార్థుల్లో 133 శాతం పెరుగుదల
- May 12, 2017
దుబాయ్: స్కూల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసు బస్సుల్ని వినియోగించే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. గతంలో 3,000గా ఉన్న ఈ సంఖ్య ఈ ఏడాది 7,000 వరకు చేరుకుందని ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ తెలిపాయి. దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి), రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది 133 శాతం అదనంగా విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ సర్వీసులను వినియోగించుకుంటున్నారని తేలింది. స్కూల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్పై విద్యార్థులు, తల్లిదండ్రులకున్న నమ్మకాన్ని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని అధికారులు తెలిపారు. స్కూల్ బస్సులపై వేగానికి సంబంధించిన సమాచారం ఉంచడం, అలాగే బస్సుకి ఓ సూపర్వైజర్ని ఏర్పాటు చేయడం, బస్సులకు సర్వైలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేయడం, వంటి చర్యల ద్వారా బస్సుల్ని, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫ్రెండ్లీగా మార్చారు. జిపిఎస్ బస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పేరెంట్స్, తమ పిల్లలు ప్రయాణిస్తున్న బస్ ఎక్కడుందో తెలుసుకునే అవకాశం కలుగుతోంది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









