స్కూల్‌ బస్‌లను వినియోగించే విద్యార్థుల్లో 133 శాతం పెరుగుదల

- May 12, 2017 , by Maagulf
స్కూల్‌ బస్‌లను వినియోగించే విద్యార్థుల్లో 133 శాతం పెరుగుదల

దుబాయ్‌: స్కూల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసు బస్సుల్ని వినియోగించే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. గతంలో 3,000గా ఉన్న ఈ సంఖ్య ఈ ఏడాది 7,000 వరకు చేరుకుందని ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీస్‌ తెలిపాయి. దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌ (డిటిసి), రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది 133 శాతం అదనంగా విద్యార్థులు ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసులను వినియోగించుకుంటున్నారని తేలింది. స్కూల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులకున్న నమ్మకాన్ని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని అధికారులు తెలిపారు. స్కూల్‌ బస్సులపై వేగానికి సంబంధించిన సమాచారం ఉంచడం, అలాగే బస్సుకి ఓ సూపర్‌వైజర్‌ని ఏర్పాటు చేయడం, బస్సులకు సర్వైలెన్స్‌ కెమెరాలు ఏర్పాటు చేయడం, వంటి చర్యల ద్వారా బస్సుల్ని, స్టూడెంట్స్‌ అండ్‌ పేరెంట్స్‌ ఫ్రెండ్లీగా మార్చారు. జిపిఎస్‌ బస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా పేరెంట్స్‌, తమ పిల్లలు ప్రయాణిస్తున్న బస్‌ ఎక్కడుందో తెలుసుకునే అవకాశం కలుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com