వరుణ్ చేతులమీదుగా 'వాసుకి' ఫస్ట్ లుక్
- May 12, 2017
మలయాళ బ్లాక్బస్టర్ 'పుదియ నియమం' తెలుగులో 'వాసుకి' గా వస్తున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'వాసుకి' ఫస్ట్లుక్ పోస్టర్ని మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ నేడు హైదరాబాద్లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, వరుణ్తేజ్ సహా చిత్రయూనిట్ పాల్గొంది. మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ మాట్లాడుతూ -"మలయాళంలో ఇప్పటికే బ్లాక్బస్టర్ హిట్ సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ అదే స్థాయి విజయం అందుకోవడమే గాకుండా.. నయన్కి చక్కని పేరు తెస్తుందనే అనుకుంటున్నా. అలాగే తెలుగు వెర్షన్ నిర్మాతకు చక్కని సక్సెస్ దక్కాలని ఆశిస్తున్నా" అన్నారు. మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ-"పొరుగు భాషలో పెద్ద హిట్టయిన ఈ చిత్రం తెలుగు నిర్మాతలకు అంతే మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నా. నిర్మాత మోహన్ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నా. వాసుకి పెద్ద హిట్టవ్వాలి.. డబ్బు, పేరు తేవాలి" అన్నారు. నిర్మాత మోహన్ మాట్లాడుతూ-"మా సినిమా ఫస్ట్లుక్ని మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ గారు, నాగబాబు గారు లాంచ్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. వారికి ధన్యవాదాలు. ఆ ఇద్దరి చేతులమీదుగా ఫస్ట్లుక్ లాంచ్ చేయడమే విజయానికి తొలి మెట్టుగా భావిస్తున్నాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు సాగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. -
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









