కెన్యా బస్సుప్రమాదంలో 19 మంది మృతి...

- May 13, 2017 , by Maagulf

నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రక్‌లు, ఒక బస్సు ఢీకొట్టుకోవడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్ది వారాల వ్యవధిలో కెన్యాలో ఇటువంటి రోడ్డు ప్రమాదం జరగడం ఇది రెండోసారి. వాయువ్య నైరోబీకి 120 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామం వద్ద ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్‌లు ఒకదానికొకటి దాటే సమయంలో బస్సును ఢీకొట్టడంతో 18 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసు కమాండర్‌ హస్సన్‌ బర్హా వెల్లడించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడని చెప్పారు. ట్రక్‌ల డ్రైవర్లతో సహా మరికొందరు చికిత్స పొందుతున్నారని వివరించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో నైరోబీ, మోంబాసా జాతీయ రహదారిపై బస్సు, ట్రక్‌ ఢీకొన్న ప్రమాదంలో 26 మంది మరణించారు. గత డిసెంబరులో ఓ ట్యాంకర్‌ బీభత్సం సృష్టించడంతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com