పాకిస్తాన్ లో కూలీలపై కాల్పులు....

- May 13, 2017 , by Maagulf
పాకిస్తాన్ లో కూలీలపై కాల్పులు....

కరాచీ: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ రాష్ట్రంలో శుక్రవారం బాంబు పేలుడు జరిగి 25మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా అదే ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకుంది. గ్వాడార్‌ పోర్టు సమీపంలో రోడ్డు పనులు చేస్తున్న కూలీలపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. వీరిలో 10 మంది కూలీలు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సింధ్‌ ప్రాంతానికి చెందిన కొందరు కూలీలు గ్వాడార్‌ పోర్టు సమీపంలో రోడ్డు ప్రాజెక్టు పనులు చేస్తుండగా.. ఆయుధాలతో వచ్చిన దుండగులు దాడి చేశారు. వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఈ ప్రాంతంలో వేర్పాటువాదులు తరచుగా దాడులు చేస్తుంటారని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com