పాకిస్తాన్ లో కూలీలపై కాల్పులు....
- May 13, 2017
కరాచీ: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ రాష్ట్రంలో శుక్రవారం బాంబు పేలుడు జరిగి 25మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా అదే ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకుంది. గ్వాడార్ పోర్టు సమీపంలో రోడ్డు పనులు చేస్తున్న కూలీలపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. వీరిలో 10 మంది కూలీలు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సింధ్ ప్రాంతానికి చెందిన కొందరు కూలీలు గ్వాడార్ పోర్టు సమీపంలో రోడ్డు ప్రాజెక్టు పనులు చేస్తుండగా.. ఆయుధాలతో వచ్చిన దుండగులు దాడి చేశారు. వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఈ ప్రాంతంలో వేర్పాటువాదులు తరచుగా దాడులు చేస్తుంటారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







