విశాఖ లో 1500 కోట్ల హవాలా కుంభకోణం దర్యాప్తు వేగవంతం
- May 13, 2017
భారీ హవాలా స్కామ్లో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు వడ్డీ మహేశ్ సహా అరెస్టైన నలుగురిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. విశాఖ, కోల్కతాల్లో డొల్లకంపెనీలను ఏర్పాటు చేసిన నిందితులు 30 బ్యాంకు ఖాతాల్లో రూ.680 కోట్లు జమచేసినట్లు పోలీసులు గుర్తించారు. వీటిల్లో 570 కోట్లను చైనా, సింగపూర్, హంకాంగ్లకు తరలించారని తెలుసుకున్నారు. ఈ కేసులో A వన్గా వడ్డి మహేశ్, A 2 అతడి తండ్రి వడ్డి శ్రీనివాసరావును పేర్కొన్న పోలీసులు ఆచంట హరీశ్, ఆచంట రాజేశ్లను ఏత్రీ, ఏ ఫోర్గా చేర్చారు. చార్టెడ్ అకౌంటెంట్లు ప్రసన్నకుమార్, ప్రవీణ్కుమార్లపై కూడా కేసులు నమోదు చేశారు. చిన్న వ్యాపారస్తులు బెంజ్ కారు కొనే స్థోమత ఎక్కడిదనే డౌటే హవాలా గుట్టు బయటపెట్టింది. కొల్ కతా కంపెనీల నుంచి డబ్బు విశాఖ బ్యాంకుల్లోకి రాగా.. ఇక్కడి నుంచి నెఫ్ట్, RTGS ద్వారా విదేశాలకు ఆ డబ్బును ట్రాన్స్ ఫర్ చేసినట్టు గుర్తించారు. హవాలా కేసులో దొరికిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్రం కూడా దీనిపై విచారణ చేపట్టనుంది. మూలాలు తెలుసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. 1369 కోట్ల కుంభకోణానికి సూత్రధారి అయిన వడ్డి మహేశ్ వెనుక ఎవరైనా ఉన్నారా.. ఇదంతా చేయించారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. అతడికి రాజకీయ నాయకులు, బడా వ్యాపారులతో ఉన్న పరిచయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







