ఆరునూరైనా అక్కడే అంటోన్నజనసేన అధినేత పవన్ కళ్యాణ్
- May 14, 2017
ఆరునూరైనా అనంతపురం నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. త్వరలోనే అనంతపురంలో పాదయాత్ర నిర్వహిస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేస్తానని.. తన తుది శ్వాస వరకూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని చెప్పారు.
తనను కొందరు పార్ట్ టైం పొలిటీషియన్ అంటున్నారని, అసలు పూర్తిగా రాజకీయాల్లో ఎవరున్నారన్నారని ప్రశ్నించారు. ఒక్కో నాయకుడు కోట్ల రూపాయలు ఆర్జించి ఇంట్లో కూర్చున్నారని, ఇంట్లోనే ఉండి రూ.కోట్లు సంపాదించే ఏర్పాట్లు చేసుకున్నారని పవన్ ఆరోపించారు. తాను మాత్రం తన కుటుంబం కోసం, తనపై ఆధారపడిన తన సిబ్బంది కోసం మాత్రమే సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. జన సేనలో స్పీకర్స్, కంటెంట్ రైటర్స్, అనలిస్ట్ లుగా పనిచేసేందుకు ముందుకొచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన దాదాపు 150మంది నూతన నాయకులతో పవన్ సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









