ఘనంగా జరిగిన టీఆర్ఎస్-యూఎస్ఏ నేషనల్ కాన్ఫరెన్స్
- May 15, 2017
కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో టీఆర్ఎస్-యూఎస్ఏ బే ఏరియా శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ యూఎస్ఏ రెండవ జాతీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. అమరులకు నివాళులు అర్పించి, ప్రొ. జయశంకర్, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ రావుకి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి సభను ప్రారంభించారు.
స్థానిక టీఆర్ఎస్ యూఎస్ఏ నాయకులు పూర్ణ బైరి సభకు అధ్యక్షత వహించారు. ఎంపీ. కల్వకుంట్ల కవిత చేతుల మీదగా టీఆర్ఎస్-యూఎస్ఏ ప్రారంభై, రెండవ నేషనల్ కాన్ఫరెన్స్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పూర్ణ బైరి అన్నారు. టీఆర్ఎస్-యూఎస్ఏ వ్యవస్థాపకులు మహేష్ తన్నీరు, టీఆర్ఎస్ ఎన్నారై విభాగాల కోర్డినేటర్ బిగాల మహేష్ గుప్త, నాగేందర్ మహీపతిలు, రజినీకాంత్ కూసానం, నవీన్ కానుగంటి రూపొందించిన టీఆర్ఎస్-యూఎస్ఏ లోగో, తక్కళ్లపల్లి అరవింద్ రూపొందించిన ఫేస్ బుక్ పేజీను ఆవిష్కరించారు. భారీగా హాజరైన సభికులను ఉద్దేశించి వ్యవస్థాపకులు తన్నీరు మహేష్ ప్రసంగించారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీఆర్ఎస్-యూఎస్ఏ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ప్రగతిబాటలో పురోగమిస్తూ, వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం గులాభి కండువా కప్పి పలువురు ఎన్నారైలను టీఆర్ఎస్ అమెరికా శాఖలోకి ఆహ్వానించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









