'జై లవకుశ' నుంచి కెమెరామన్ మురళీధరన్ ఔట్

- May 16, 2017 , by Maagulf
'జై లవకుశ' నుంచి కెమెరామన్ మురళీధరన్  ఔట్

ఎన్టీఆర్- బాబీ డైరెక్షన్‌లో రెడీ అవుతున్న ఫిల్మ్ 'జై లవకుశ'. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫేమస్ కెమెరామన్ మురళీధరన్ తప్పుకున్నట్లు సమాచారం. గతంలో ఈయన స్టార్ హీరోల సినిమాలకు కెమెరామన్‌గా వ్యవహరించాడు. కొన్ని సీన్ల విషయంలో డైరెక్టర్- కెమెరామన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో మురళీ డ్రాపైనట్టు యూనిట్ చెబుతున్నమాట. వెంటనే ఆలోచనలోపడిన యూనిట్, ఈలోగా ఛోటా కె.నాయుడు సంప్రదించడం ఆయన ఓకే చేయడం కూడా జరిగిపోయింది.
బాబీ సినిమాల్లో కెమెరామన్లు డ్రాప్ కావడం ఇదేం కొత్తకాదు. గతంలో రవితేజ-'పవర్', పవన్‌కల్యాణ్- 'గబ్బర్‌సింగ్‌2' వంటి చిత్రాల్లో బాబీ ఒత్తిడి వల్ల కెమెరామన్ల తప్పుకున్న విషయం తెల్సిందే! ఇప్పుడు జై లవకుశకూ ఆ గాలి సోకింది. మరోవైపు డైరెక్టర్ వల్ల కాదని, నిర్మాత కల్యాణ్‌రామ్ బావమదిరితో విభేదాలు రావడం వల్లనే కెమెరామన్ తప్పుకున్నాడన్నది అంతర్గత సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com