30న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
- May 16, 2017
దేశ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు ఈ నెల 30న కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్ 1న వచ్చే రుతుపవనాలు ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా వుండడంతో రెండు రోజుల ముందుగానే కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దక్షిణ అండమాన్లో ప్రవేశించిన రుతుపవనాలు మంగళవారం నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలో అనేక ప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవులకు పూర్తిగా విస్తరించాయి. వచ్చే 48 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రం మొత్తం, తూర్పు, మధ్య బంగాళాఖాతాలకు విస్తరిస్తాయని తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాలు గత ఏడాది జూన్ 7న ప్రవేశించగా, 2015లో కూడా మే 30నే కేరళను తాకాయి. ఈ ఏడాది రుతుపవనాల రాకకు సంబంధించి అనేక అంశాలు అనుకూలంగా వుండడంతో సాధారణ తేదీకి రెండు రోజుల ముందుగా వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ అంచనాకు నాలుగు రోజులు అటు ఇటుగా రావచ్చని తెలిపింది. దక్షిణ చైనా సముద్రం, పశ్చిమ పసిఫిక్, హిందూ మహాసముద్రంలో తేమగాలులు రుతుపవనాలకు అనుకూలంగా వున్నాయని పేర్కొంది. కాగా, ఉత్తర కోస్తా నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది.
దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో చెదురుముదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల్లో వడగాడ్పులు వీస్తాయని, రుతుపవనాలు వచ్చే వరకు ఎండ తీవ్రత, గాడ్పులు కొనసాగుతాయని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







