హైదరాబాద్ కబడ్డీ జట్టులో కొనసాగనున్న రాహుల్‌

- May 16, 2017 , by Maagulf
హైదరాబాద్  కబడ్డీ జట్టులో కొనసాగనున్న రాహుల్‌

దేశవ్యాప్తంగా అభిమానులను అలరించడానికి ప్రొ కబడ్డీ అయిదవ సీజన్‌ వచ్చేస్తుంది.జులైలో మ్యాచ్‌లు ప్రారంభం కానున్న సమయంలో ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లపై దృష్టి నిలిపాయి.స్టార్‌ ఆటగాళ్లను తమతోనే కొనసాగేలా చూస్తున్నాయి.ఈ సీజన్‌లో మొత్తం 350 క్రీడాకారులు భాగం కానున్నారు.టీమిండియామాజీ సారథి అనూప్‌ కుమార్‌ యు- ముంబా తరిగి తీసుకొంది.అతడి సారథ్యంలో ఆ జట్టు మూడుసార్లుఫైనల్‌కు వెళ్లింది.సీజన్‌-2లో ట్రోఫీ గెలిచింది.ప్రొ కబడ్డీ చరిత్రలో అత్యంత విజయవంతమైన రైడర్‌ రాహుల్‌ చౌదరిని తెలుగు టైటాన్స్‌ తమతోనే కొనసాగిస్తుంది.కబడ్డీ ప్రపంచ కప్‌ ఇరాన్‌ను రన్నరప్‌గా నిలిపిన సారథిఆల్‌రౌండర్‌ మిరాజ్‌ను ఢిల్లీ,కొరియా స్టార్‌ రైడర్‌ జాన్‌ కున్‌ లీని బెంగాల్‌ వారియర్స్‌ తమతో ఉంచుకొన్నాయి.ఆశీశ్‌ కుమార్‌ను బెంగళూరు బుల్స్‌,ప్రదీప్‌ నర్వాల్‌ను పట్నా పైరేట్స్‌,దీపక్‌ హుడాను పుణేరి పల్టాన్‌ దక్కించుకొన్నాయి.ఒక్క జైపూర్‌ పింక్‌ పాం థర్స్‌ మాత్రమే ఎవరిని తీసుకోలేదు. ఈ సీజన్‌లో కొత్తగా నాలుగు ఫ్రాంచైజీలు వస్తున్నాయి  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com