వలసదారుడి అదృశ్యం
- May 17, 2017
పదేళ్ళ క్రితమే బహ్రెయిన్కి వచ్చిన భారతీయ వలసదారుడు గుసర్మీత్ సింగ్, అదృశ్యమవడం పట్ల ఆందోలన వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. మూడేళ్ళుగా ఆయన ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్మీత్ సింగ్ ఆచూకీ కోసం విచారణ వేగవంతం చేశారు. వ్యవసాయ కార్మికుడిగా పనిచేసేందుకు గుర్మీత్, బహ్రెయిన్కి వచ్చినట్లు తెలియవస్తోంది. తన యజమాని వద్ద కాకుండా ఇంకొకరి వద్ద ఉండటంతో, అతని పాస్పోర్ట్, వీసా చెల్లే అవకాశం లేదు. గతంలో గుర్మీత్ నుంచి అప్పుడప్పుడూ ఫోన్ కాల్ వచ్చేదనీ, అప్పుడప్పుడూ డబ్బు కూడా పంపించేవారనీ, మూడేళ్ళ నుంచి అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. గుర్మీత్ సింగ్కి ఇద్దరు పిల్లలున్నారు. గుర్మీత్కౌర్ భార్య నిర్మల్ కౌర్, తన భర్త ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..









