భిక్షాటన చేపట్టిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు
- May 18, 2017
ఉపాధి కల్పించాలని కోరుతూ విశాఖ స్టీల్ప్లాంట్ నిర్వాసితులు గురువారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద భిక్షాటన చేపట్టారు. విశాఖ ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం, విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్టు లేబర్ యూనియన్ ఆధ్వర్యాన చేపట్టిన కార్యక్రమంలో నిర్వాసితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు సంఘాల ప్రధాన కార్యదర్శులు ఉమ్మడి అప్పారావు, దుగ్గపు అప్పలరాజు మాట్లాడారు. స్టీల్ప్లాంట్ నిర్మాణం జరిగితే 60 వేల మంది నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారని చెప్పారు. ఈ క్రమంలో 17 వేల మందికి ఆర్.కార్డులు ఇచ్చారని, వారిలో కొందరికే ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఆర్.కార్డులున్న వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









