భిక్షాటన చేపట్టిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు
- May 18, 2017
ఉపాధి కల్పించాలని కోరుతూ విశాఖ స్టీల్ప్లాంట్ నిర్వాసితులు గురువారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద భిక్షాటన చేపట్టారు. విశాఖ ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం, విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్టు లేబర్ యూనియన్ ఆధ్వర్యాన చేపట్టిన కార్యక్రమంలో నిర్వాసితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు సంఘాల ప్రధాన కార్యదర్శులు ఉమ్మడి అప్పారావు, దుగ్గపు అప్పలరాజు మాట్లాడారు. స్టీల్ప్లాంట్ నిర్మాణం జరిగితే 60 వేల మంది నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారని చెప్పారు. ఈ క్రమంలో 17 వేల మందికి ఆర్.కార్డులు ఇచ్చారని, వారిలో కొందరికే ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఆర్.కార్డులున్న వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







