భిక్షాటన చేపట్టిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు
- May 18, 2017
ఉపాధి కల్పించాలని కోరుతూ విశాఖ స్టీల్ప్లాంట్ నిర్వాసితులు గురువారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద భిక్షాటన చేపట్టారు. విశాఖ ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం, విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్టు లేబర్ యూనియన్ ఆధ్వర్యాన చేపట్టిన కార్యక్రమంలో నిర్వాసితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు సంఘాల ప్రధాన కార్యదర్శులు ఉమ్మడి అప్పారావు, దుగ్గపు అప్పలరాజు మాట్లాడారు. స్టీల్ప్లాంట్ నిర్మాణం జరిగితే 60 వేల మంది నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారని చెప్పారు. ఈ క్రమంలో 17 వేల మందికి ఆర్.కార్డులు ఇచ్చారని, వారిలో కొందరికే ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఆర్.కార్డులున్న వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









