ఔరా! ఎంత మాటన్నారు!!
- May 18, 2017
ఏపీ పారిశ్రామిక ప్రగతివైపు దూసుకుపోతోందన్నది తెలుగు దేశం నేతలు చెప్పేమాట. ఇప్పటికే సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ హైదరాబాద్ నుంచి అమరావతి బాట పట్టాయని అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించాయి పసుపు దళాలు. మరి ఇంతకీ వాస్తవం ఎలా ఉంది. మేథాటవర్స్ లో ఇటీవలే కొన్ని ఐటీ కంపెనీలు పనులు ప్రారంభించాయి.
దీనికితోడు ఇప్పటికే విశాఖ పట్నంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న కోర్సులను క్రియేట్ చేసి యువతకు ఐటీ రంగంలో ఉపాధి కల్పించాలన్నది మంత్రి లోకేశ్ డ్రీమ్. మరి ఇలాంటి నేపథ్యం ఉంటే.. ఓ ఆంధ్రా మంత్రి మాత్రం ఏపీలోని సాఫ్ట్ వేర్ పరిశ్రమల పరువు తీసేశాడు. ఏపీలోని సాఫ్ట్ వేర్ కంపెనీలపై పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఒకటే విమర్శలు గుప్పించారు.
విశాఖపట్టణంలో పారిశ్రామికవేత్తలతో నోవాటెల్ హోటల్లో జరిగిన సదస్సులో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలకు పెద్ద ప్రాజెక్టులు చేయగలిగే సత్తా లేదని కామెంట్ చేశారు. అలాంటి ప్రాజెక్టులు చేయగలమని నిరూపించుకుంటేనే ప్రభుత్వానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ సర్వీసులు ఇక్కడి వారికి కేటాయిస్తామని వ్యాఖ్యానించారు మంత్రి అమర్ నాథ్ రెడ్డి. మరి ఐటీ రంగం గురించి నిత్యం కొట్టే డప్పు అంతా కేవలం భజన మాత్రమేనా..!?
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









