ఔరా! ఎంత మాటన్నారు!!
- May 18, 2017
ఏపీ పారిశ్రామిక ప్రగతివైపు దూసుకుపోతోందన్నది తెలుగు దేశం నేతలు చెప్పేమాట. ఇప్పటికే సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ హైదరాబాద్ నుంచి అమరావతి బాట పట్టాయని అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించాయి పసుపు దళాలు. మరి ఇంతకీ వాస్తవం ఎలా ఉంది. మేథాటవర్స్ లో ఇటీవలే కొన్ని ఐటీ కంపెనీలు పనులు ప్రారంభించాయి.
దీనికితోడు ఇప్పటికే విశాఖ పట్నంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న కోర్సులను క్రియేట్ చేసి యువతకు ఐటీ రంగంలో ఉపాధి కల్పించాలన్నది మంత్రి లోకేశ్ డ్రీమ్. మరి ఇలాంటి నేపథ్యం ఉంటే.. ఓ ఆంధ్రా మంత్రి మాత్రం ఏపీలోని సాఫ్ట్ వేర్ పరిశ్రమల పరువు తీసేశాడు. ఏపీలోని సాఫ్ట్ వేర్ కంపెనీలపై పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఒకటే విమర్శలు గుప్పించారు.
విశాఖపట్టణంలో పారిశ్రామికవేత్తలతో నోవాటెల్ హోటల్లో జరిగిన సదస్సులో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలకు పెద్ద ప్రాజెక్టులు చేయగలిగే సత్తా లేదని కామెంట్ చేశారు. అలాంటి ప్రాజెక్టులు చేయగలమని నిరూపించుకుంటేనే ప్రభుత్వానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ సర్వీసులు ఇక్కడి వారికి కేటాయిస్తామని వ్యాఖ్యానించారు మంత్రి అమర్ నాథ్ రెడ్డి. మరి ఐటీ రంగం గురించి నిత్యం కొట్టే డప్పు అంతా కేవలం భజన మాత్రమేనా..!?
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









