ఔరా! ఎంత మాటన్నారు!!
- May 18, 2017
ఏపీ పారిశ్రామిక ప్రగతివైపు దూసుకుపోతోందన్నది తెలుగు దేశం నేతలు చెప్పేమాట. ఇప్పటికే సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ హైదరాబాద్ నుంచి అమరావతి బాట పట్టాయని అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించాయి పసుపు దళాలు. మరి ఇంతకీ వాస్తవం ఎలా ఉంది. మేథాటవర్స్ లో ఇటీవలే కొన్ని ఐటీ కంపెనీలు పనులు ప్రారంభించాయి.
దీనికితోడు ఇప్పటికే విశాఖ పట్నంలోనూ కొన్ని ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న కోర్సులను క్రియేట్ చేసి యువతకు ఐటీ రంగంలో ఉపాధి కల్పించాలన్నది మంత్రి లోకేశ్ డ్రీమ్. మరి ఇలాంటి నేపథ్యం ఉంటే.. ఓ ఆంధ్రా మంత్రి మాత్రం ఏపీలోని సాఫ్ట్ వేర్ పరిశ్రమల పరువు తీసేశాడు. ఏపీలోని సాఫ్ట్ వేర్ కంపెనీలపై పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఒకటే విమర్శలు గుప్పించారు.
విశాఖపట్టణంలో పారిశ్రామికవేత్తలతో నోవాటెల్ హోటల్లో జరిగిన సదస్సులో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలకు పెద్ద ప్రాజెక్టులు చేయగలిగే సత్తా లేదని కామెంట్ చేశారు. అలాంటి ప్రాజెక్టులు చేయగలమని నిరూపించుకుంటేనే ప్రభుత్వానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ సర్వీసులు ఇక్కడి వారికి కేటాయిస్తామని వ్యాఖ్యానించారు మంత్రి అమర్ నాథ్ రెడ్డి. మరి ఐటీ రంగం గురించి నిత్యం కొట్టే డప్పు అంతా కేవలం భజన మాత్రమేనా..!?
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









