బిహార్‌ రాజధాని పట్నామాల్‌లో అగ్నిప్రమాదం: 30షాపులు దగ్ధం

- May 20, 2017 , by Maagulf
బిహార్‌ రాజధాని పట్నామాల్‌లో అగ్నిప్రమాదం: 30షాపులు దగ్ధం

బిహార్‌ రాజధాని పట్నాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.బోరింగ్‌ రోడ్‌లోని జీవీ మాల్‌లో శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌ నుంచి చెలరేగిన మంటలు కొద్ది సేపటికే మాల్‌లోని అయిదు అంతస్థులకు వ్యాపించాయి.దీంతో మాల్‌లోని మొత్తం 30 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.
మంటలు చెలరేగిన మాల్‌ చుట్టుపక్కల ఓ పెట్రోల్‌బంక్‌, హిందీ ప్రింట్‌ మీడియా హెడ్‌క్వార్టర్స్‌, రెసిడెన్షియల్‌ భవనం, ఎలక్ట్రానిక్‌ వస్తువుల షోరూం ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. మాల్‌లో కోచింగ్‌ సెంటర్‌, రెస్టారెంట్‌, మరికొన్ని రిటైల్‌ దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని, నష్టం రూ.కోట్లలో ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నది మాత్రం స్పష్టత రాలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com