సోషల్‌ మీడియా డొనేషన్‌ ప్రకటనలపై హెచ్చరిక

- May 20, 2017 , by Maagulf
సోషల్‌ మీడియా డొనేషన్‌ ప్రకటనలపై హెచ్చరిక

సోషల్‌ మీడియా ద్వారా డొనేషన్ల కోసం ఎవరైనా ఎలాంటి ఫేక్‌ ప్రకటనలు ఇచ్చినా అది నేరం కింద పరిగణిస్తామని దుబాయ్‌ పోలీస్‌ సీనియర్‌ అధికారి చెప్పారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా ఫేక్‌ ప్రకటనలతో చాలామంది మోసపోతున్నట్లు దుబాయ్‌ పోలీస్‌ చీఫ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ ఎఫైర్స్‌ అసిస్టెంట్‌ మేజర్‌ జనరల్‌ ఖలీల్‌ ఇబ్రహీమ్‌ అల్‌ మన్సౌరి చెప్పారు. 50,000 దిర్హామ్‌లు డొనేషన్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నామనీ, జైల్లో ఉండి ఆర్థిక సమస్యలతో అందులోంచి బయటకు రాలేకపోతున్నవారికి సహాయం చేస్తామని కొందరు ఫేక్‌ మెసేజ్‌లను ప్రచారంలోకి తీసుకువచ్చారనీ, వాటికి ఆకర్షితురాలైన ఓ మహిళ తన భర్త కోసం వారిని ఆశ్రయించి మోసపోయిందని ఆయన వివరించారు. ఇలాంటి మెసేజ్‌లు ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారాయన. ఎప్పటికప్పుడు దుబాయ్‌ పోలీస్‌, ఈ తరహా మెసేజ్‌లపై నిఘాపెట్టి, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com