కువైట్ లో 'గల్ఫ్ స్పిక్ ' కంపెనీని సందర్శించిన ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి
- May 20, 2017
ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర తన పర్యటన నిమిత్తం కువైట్ లోని ప్రవాసాంధ్ర తెలుగు దేశం ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కువైట్ లోని ప్రముఖ చమురు సంస్థ 'గల్ఫ్ స్పిక్ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్టింగ్ కంపెనీ' యాజమాన్యాన్ని కలిసి అక్కడ పనిచేస్తున్న ప్రవాసీయుల కష్ట సుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కువైట్ లోని ఉద్యోగ అవకాశాలు, కల్పిస్తున్న సదుపాయాలూ, వెసులుబాట్లు, జీవనోపాధికై పొట్ట చేత పట్టుకొని వచ్చే కార్మికులకు కువైట్ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా 'గల్ఫ్ స్పిక్ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్టింగ్ కంపెనీ' ను క్షుణ్ణంగా పరిశీలించి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి అత్యున్నత పరిమాణాలున్న పరిశ్రమలు కల్పించే దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఆయనతో పాటు ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ అధ్యక్షులు ముల్కల సుబ్బారాయుడు, వెంకట్ కోడూరి,రమేష్,కుమార్,మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు, తెలుగు విద్యార్థి అధినేత కొల్లూరి వెంకట శివ కుమార్,సురేష్,రమణ,హరిబాబు తక్కెళ్ళపాటి తదితరులు పాల్గొన్నారు.



_1495348304.jpg)

తాజా వార్తలు
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన









