కువైట్ లో 'గల్ఫ్ స్పిక్ ' కంపెనీని సందర్శించిన ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి
- May 20, 2017
ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర తన పర్యటన నిమిత్తం కువైట్ లోని ప్రవాసాంధ్ర తెలుగు దేశం ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కువైట్ లోని ప్రముఖ చమురు సంస్థ 'గల్ఫ్ స్పిక్ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్టింగ్ కంపెనీ' యాజమాన్యాన్ని కలిసి అక్కడ పనిచేస్తున్న ప్రవాసీయుల కష్ట సుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కువైట్ లోని ఉద్యోగ అవకాశాలు, కల్పిస్తున్న సదుపాయాలూ, వెసులుబాట్లు, జీవనోపాధికై పొట్ట చేత పట్టుకొని వచ్చే కార్మికులకు కువైట్ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా 'గల్ఫ్ స్పిక్ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్టింగ్ కంపెనీ' ను క్షుణ్ణంగా పరిశీలించి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి అత్యున్నత పరిమాణాలున్న పరిశ్రమలు కల్పించే దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఆయనతో పాటు ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ అధ్యక్షులు ముల్కల సుబ్బారాయుడు, వెంకట్ కోడూరి,రమేష్,కుమార్,మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు, తెలుగు విద్యార్థి అధినేత కొల్లూరి వెంకట శివ కుమార్,సురేష్,రమణ,హరిబాబు తక్కెళ్ళపాటి తదితరులు పాల్గొన్నారు.



_1495348304.jpg)

తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







