కువైట్ లో 'గల్ఫ్ స్పిక్ ' కంపెనీని సందర్శించిన ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి
- May 20, 2017
ఏ.పి.ఎన్.ఆర్.ఐ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర తన పర్యటన నిమిత్తం కువైట్ లోని ప్రవాసాంధ్ర తెలుగు దేశం ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కువైట్ లోని ప్రముఖ చమురు సంస్థ 'గల్ఫ్ స్పిక్ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్టింగ్ కంపెనీ' యాజమాన్యాన్ని కలిసి అక్కడ పనిచేస్తున్న ప్రవాసీయుల కష్ట సుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కువైట్ లోని ఉద్యోగ అవకాశాలు, కల్పిస్తున్న సదుపాయాలూ, వెసులుబాట్లు, జీవనోపాధికై పొట్ట చేత పట్టుకొని వచ్చే కార్మికులకు కువైట్ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా 'గల్ఫ్ స్పిక్ జనరల్ ట్రేడింగ్ & కాంట్రాక్టింగ్ కంపెనీ' ను క్షుణ్ణంగా పరిశీలించి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటి అత్యున్నత పరిమాణాలున్న పరిశ్రమలు కల్పించే దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఆయనతో పాటు ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ అధ్యక్షులు ముల్కల సుబ్బారాయుడు, వెంకట్ కోడూరి,రమేష్,కుమార్,మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు, తెలుగు విద్యార్థి అధినేత కొల్లూరి వెంకట శివ కుమార్,సురేష్,రమణ,హరిబాబు తక్కెళ్ళపాటి తదితరులు పాల్గొన్నారు.



_1495348304.jpg)

తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









