అమెరికాలో ఆలాప్ నరసిపురా అనే మరో భారతీయ విద్యార్ధి మృతి
- May 21, 2017
అమెరికాలో మరో భారతీయ విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కార్నెల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఆలాప్ నరసిపురా అనే స్టూడెంట్ ఈనెల 17నుంచి కనిపించకుండా పోయాడు. న్యూయార్క్ లోని ఫాల్ క్రిక్ ప్రాంతంలో ఓ మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికిచేరుకొని పరిశీలించగా...అతన్ని నరసిపురగా గుర్తించారు. బుధవారం వరకు అతన్ని చూశామని తోటి విద్యార్ధులు అంటున్నారు. నరసిపుర మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ప్రవాస భారతీయులపై జాత్యహంకార దాడులు పెరుగిపోతున్న నేపధ్యంలో విద్యార్ధి మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్టూడెంట్ మృతికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదన్న పోలీసులు... అతను నివాసం ఉంటున్న ఇంట్లో, కాలేజీలను పరిశీలించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









