అమెరికాలో ఆలాప్ నరసిపురా అనే మరో భారతీయ విద్యార్ధి మృతి
- May 21, 2017
అమెరికాలో మరో భారతీయ విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కార్నెల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఆలాప్ నరసిపురా అనే స్టూడెంట్ ఈనెల 17నుంచి కనిపించకుండా పోయాడు. న్యూయార్క్ లోని ఫాల్ క్రిక్ ప్రాంతంలో ఓ మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికిచేరుకొని పరిశీలించగా...అతన్ని నరసిపురగా గుర్తించారు. బుధవారం వరకు అతన్ని చూశామని తోటి విద్యార్ధులు అంటున్నారు. నరసిపుర మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ప్రవాస భారతీయులపై జాత్యహంకార దాడులు పెరుగిపోతున్న నేపధ్యంలో విద్యార్ధి మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్టూడెంట్ మృతికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదన్న పోలీసులు... అతను నివాసం ఉంటున్న ఇంట్లో, కాలేజీలను పరిశీలించారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







