హైదరాబాద్లో వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ తో బస్ స్టాప్స్ నిర్మాణం.. ఆకర్షిస్తోన్న వైనం
- May 21, 2017
కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీ శ్రీ.. కాదేదీ నిర్మాణానికి అనార్హం అంటున్నారు.. నేటి యువ శక్తి... అవును సృష్టిలో మానవుడు ఒక్కడే వ్యర్ధ పదార్ధం.. మిగిలినవన్నీ మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోదగినవే అన్న సంగతి విధితమే.. కాగా మానవుని సృష్టి.. ప్లాస్టిక్ కూడా వ్యర్దమే.. ఈ ప్లాస్టిక్ ని ఏ రూపంలో ఉపయోగించినా.. తిరిగి పడవేసే సమయంలో భూమిలోకి అవి కరగవు.. దీంతో పర్యావరణానికి ఎంతో హాని చేకూరుతుంది ఈ ప్లాస్టిక్ వల్ల.. కాగా ఇక ప్లాస్టిక్ బాటిల్స్ కూడా అదే కోవలోకి చేరతాయి.. కానీ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ను ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో ఎన్నో ఉపయోగకరమైన పనులను చేస్తోంది... బాంబూ హౌజ్ ఇండియా అనే సంస్థ... అవును ప్లాస్టిక్ ని రీ సైకిల్ ఇండియా పేరుతో బాంబూ హౌస్ ఇండియా సంస్థ ఓ సరికొత్త నిర్మాణానికి తెరతీసింది. ఇప్పటికే వాడి పడేసిన టైర్లు, ప్లాస్టిక్ డ్రమ్స్ను రీసైకిల్ చేసి వాటితో సీట్లు, బెంచీలు తయారు చేస్తోన్న సంగతి విధితమే.. కాగా తాజాగా ఈ సంస్థ ఉప్పల్లోని స్వరూపనగర్ కాలనీలో ప్లాస్టిక్ బాటిల్స్తో ఓ బస్ షెల్టర్ ను నిర్మించింది. కాగా హైదరాబాద్లో సరిపడా బస్ షెల్టర్లు లేకపోవడంతో… బస్ షెల్టర్లు నిర్మించేందుకు తమ సంస్థ ముందుకొచ్చిందని తెలిపింది యాజమాన్యం. బస్ షెల్టర్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు పెద్దమొత్తంలో డబ్బులను డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కూడా కాస్త వెనకడుగు వేసింది. ఈ క్రమంలోనే తమ కంపెనీ ప్లాస్టిక్ బాటిల్స్ తో బస్షెల్టర్ను నిర్మిస్తుంది అని యాజమాన్యం తెలిపింది.. ఈ బస్ షెల్టర్ను తయారు చేసేందుకు 1000 ఒక లీటర్ వాటర్ బాటిల్స్ వినియోగించినట్లు బాంబూ హౌజ్ ఇండియా వ్యవస్థాపకులు ప్రశాంత్ తెలిపారు. ఒక్కో బాటిల్ రూ1.40 కి కొనుగోలు చేసినట్లు ... బస్ షెల్టర్ కొలతలు 8*4 అడుగులుగా ఉందని, దీంతో ఆ సైజ్ ఫ్రేమ్ను మెటల్తో తయారు చేసినట్లు ప్రశాంత్ తెలిపారు. ఇవన్నీ ఖరీదు చెయ్యడానికి అయిన మొత్తం అయిన ఖర్చు కేవలం రూ.15వేలు అని చెప్పారు. అంతేకాదు అనవసరం అనుకుంటే మళ్లీ ఈ షెల్టర్ ను తొలగించొచ్చని చెప్పారు. ఈ నిర్మాణాలు తక్కువ ఖర్చుతో జరగడమే కాదు.. ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









