భారత్ ఉగ్రవాద బాధిత దేశమన్న అమెరికా అధ్యకుడు ట్రంప్

- May 22, 2017 , by Maagulf
భారత్ ఉగ్రవాద బాధిత దేశమన్న అమెరికా అధ్యకుడు ట్రంప్

సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ట్రంప్ భారత్ గురించి ప్రస్తావిస్తూ పాక్‌కు చురకలు అంటించారు.  రియాద్‌లోని అరబ్ ఇస్లామిక్-యూఎస్ సదస్సులో పాల్గొన్న ట్రంప్ భారత్ గురించి మాట్లాడుతూ భారత్ కూడ ఉగ్రవాద బాధిత దేశమని ఆయన గుర్తు చేశారు.  అమెరికా నుంచి భారత్ వరకు, ఆస్ట్రేలియా నుంచి రష్యా వరకు అన్ని దేశాలు ఉగ్రవాద బాధితులేనని, ఏ దేశం కూడా తమ భూభాగంలో ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించకూడదని అన్నారు.  దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాద భావజాలాన్ని అణిచివేసేందుకు ఆయా దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com