రైల్వే ఉద్యోగుల పంటపండింది

- October 08, 2015 , by Maagulf
రైల్వే ఉద్యోగుల పంటపండింది

రైల్వే ఉద్యోగుల పంటపండింది. ఈ యేడాది దసరా - దీపావళి బోనస్‌ కింద 78 రోజుల వేతనాన్ని అందుకోనున్నారు. 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్‌గా ఈ మొత్తాన్ని ఆందజేస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో 12.58 లక్షల మంది నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 2014-15కుగాను 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందజేయనున్నట్టు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.8,975 వంతున రూ.1,030 కోట్లు మంజూరు చేస్తారని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com