ఇ-రింగ్‌రోడ్‌పై పాదచారుల వంతెన త్వరలో ప్రారంభం

- May 23, 2017 , by Maagulf
ఇ-రింగ్‌రోడ్‌పై పాదచారుల వంతెన త్వరలో ప్రారంభం

ఇ-రింగ్‌ రోడ్‌పై పాదచారుల వంతెన, జూన్‌లో ప్రారంభం కానుంది. పాదచారులకు ఇది నిజంగానే ఓ వరం కానుంది. ఓల్డ్‌ ఎయిర్‌ పోర్ట్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీస్‌ (మురుర్‌) చేరుకునేవారికి ఇది ఎంతో వీలుగా ఉంటుంది. కార్మికులు తాజాగా 2 లేయర్ల 22 ఎంఎం లామినేటెడ్‌ టాంపర్డ్‌ గ్లాస్‌ని బ్రిడ్జిపై ఏర్పాటు చేస్తున్నారు. 66.12 మీటర్ల పొడవైన బ్రిడ్జి ఎత్తు 12.5 మీటర్లు. అల్‌ తుమామా మరియు ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ మధ్య దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అష్గల్‌ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారిపై బ్రిడ్జి నిర్మాణంతో పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు. జూన్‌లో ఈ బ్రిడ్జిని పాదచారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 15 పాదచారుల వంతెనల్ని నిర్మించేందుకోసం మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రకటన చేసింది. ఖతార్‌లోని పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com