ఇ-రింగ్రోడ్పై పాదచారుల వంతెన త్వరలో ప్రారంభం
- May 23, 2017
ఇ-రింగ్ రోడ్పై పాదచారుల వంతెన, జూన్లో ప్రారంభం కానుంది. పాదచారులకు ఇది నిజంగానే ఓ వరం కానుంది. ఓల్డ్ ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీస్ (మురుర్) చేరుకునేవారికి ఇది ఎంతో వీలుగా ఉంటుంది. కార్మికులు తాజాగా 2 లేయర్ల 22 ఎంఎం లామినేటెడ్ టాంపర్డ్ గ్లాస్ని బ్రిడ్జిపై ఏర్పాటు చేస్తున్నారు. 66.12 మీటర్ల పొడవైన బ్రిడ్జి ఎత్తు 12.5 మీటర్లు. అల్ తుమామా మరియు ఓల్డ్ ఎయిర్పోర్ట్ మధ్య దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అష్గల్ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారిపై బ్రిడ్జి నిర్మాణంతో పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు. జూన్లో ఈ బ్రిడ్జిని పాదచారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 15 పాదచారుల వంతెనల్ని నిర్మించేందుకోసం మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రకటన చేసింది. ఖతార్లోని పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









