26 ప్రైవేట్ స్కూల్స్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ 'ఫ్రీజ్'
- May 23, 2017
అబుదాబీ స్కూల్స్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని పెంచే క్రమంలో ఎడిఇసి, 26 స్కూళ్ళల్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ని ఫ్రీజ్ చేసింది. పూర్ మరియు వెరీ పూర్ కేటగిరీల్లోకి చేరిన సంస్థల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫ్రీజ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అబుదాబీ, అల్ అయిన్ ప్రాంతం, అల్ దఫ్రా ప్రాంతాలకు సంబంధించి 26 స్కూళ్ళపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎడిఇసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ క్వాలిటీ ఎష్యూరెన్స్ సెక్టార్ ఇంజనీర్ హమాద్ అల్ దహెరి మాట్లాడుతూ, ఫ్రీజ్ అయిన స్కూళ్ళు తిరిగి, 'శాటిస్ఫ్యాక్టరీ' పెర్ఫామెన్స్ పొందేవరకు రిజిస్ట్రేషన్లకు వీలు కాదని స్పష్టం చేశారు. ఫ్రీజ్ చేయబడిన స్కూల్స్, తమ స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇర్టికా ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా ఎడిఇసి, స్కూల్స్లో డిటెయిల్డ్ ఫీడ్ బ్యాక్ మరియు రిపోర్ట్స్ని తయారు చేసి, స్కూల్ పెర్ఫామెన్స్ని అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









