ఐస్ దాడులు గురించి ముందే చెప్పినా వినని బ్రిటిష్ ప్రభుత్వం
- May 24, 2017
ఓ చిన్న నిర్లక్షం ఖరీదు కొన్ని వందలమంది ప్రాణం ఖరీదు.. కొన్నికుటుంబాల ఘోష.. ప్రస్తుతం బ్రిటిష్ ప్రభుత్వం చేసిన నిర్లక్షం.. తాజాగా జరిగిన మాంచెస్టర్ దాడి.. అవును ఉగ్రవాదుల పై పరిశోధనలు చేసే న్యాయవాది మాక్స్ హిల్ .. మాంచెస్టర్ దాడిని ముందే ఊహించి.. ఐఎస్ అంతం కాలేదని.. మళ్ళీ విజృంభిస్తుందని చెప్పారు.. బ్రిటన్ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.. కానీ ఆయన మాటలు ఎవరు లెక్కచెయ్యలేదు.. ఇక బ్రిటన్ ప్రభుత్వం అసలు ఆయన మాటలను పరిగణలోకి కూడా తీసుకోలేదు.. కారణం... రెండు నెలల కిందట ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాది స్లామిక్ స్టేట్ ఓటమి పాలయ్యిందంటూ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు ఐఎస్ ఉగ్రవాదులందరూ ఆత్మహత్య చేసుకోవాలని కూడా వీడ్కోలు ప్రసంగం చేశాడు. దీంతో ఐఎస్ అంతమైందని బ్రిటన్ భావించింది. కాగా ఇదే సమయంలో మాక్స్ హిల్ ఐఎస్ లోని భిన్నకోణాన్ని ఆవిష్కరించాడు. అది అంతం కాలేదని.. అదను చూసి ఎటాక్ చేస్తుందని చెబుతూనే ఉన్నాడు. దృష్టి మళ్లించేందుకే బాగ్దాదీ ఈ ప్రకటన చేశారని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ ఎవరూ నమ్మలేదు. ఇంతలోనే ఐఎస్ భీకర దాడికి తెగబడింది. మాక్స్ హిల్ మాటలను నిజం చేసింది. ఈయన గతంలోనే ఇరాక్.. సిరియాల్లో చావుదెబ్బ తిన్న ఇస్లామిక్ స్టేట్.. అప్పుడే బ్రిటన్ను టార్గెట్ చేసుకుందని, ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే బాగ్దాదీ వీడ్కోలు ప్రకటన చేశాడని వివరించాడు. ఐఎస్ ఇకపై చేయబోయే దాడులు కొత్త తరహాలో ఉంటాయని వెల్లడించాడు. అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిక్ స్టేట్.. వెస్ట్ లండన్ పేలుళ్లకంటే కూడా తీవ్రమైన దాడులకు ప్లాన్ చేస్తోందని తెలిపాడు. కానీ బ్రిటన్ ప్రభుత్వం అతని మాటలు పట్టించుకోలేదు.. నిఘావర్గాలను అప్రమత్తం చేయలేదు.. నిఘావర్గాలు కనుక పనిచేసి ఉంటే.. ఐఎస్ దాడి ప్లాన్ను పటాపంచలు చేసి ఉండేవారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









