మరణశిక్ష తప్పింది జైలు శిక్షతో సరిపెట్టింది
- May 26, 2017
పాకిస్తానీ వ్యక్తి హత్య ఘటనలో మరణ శిక్ష పడ్డ 10 మంది భారతీయులకు, మరణ శిక్ష తప్పించి, జైలు శిక్ష విధిస్తూ అల్ అయిన్ కోర్ట్ తీర్పునిచ్చింది. 10మందిలో ఇద్దరికి మూడున్నరేళ్ళ జైలు శిక్ష, ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష, ఇద్దరికి ఏడాదిన్నర జైలు శిక్ష, మిగిలిన ముగ్గురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ ఎంబసీ ఫస్ట్ సెక్రెటరీ ఫర్ కమ్యూనిటీ ఎఫైర్స్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, 2015 నుంచి జైల్లో ఉన్న వారికి ఈ శిక్ష తగ్గింపు ఎంతో ఊరట కలిగిస్తుందనీ, వారి కుటుంబాల్లో ఆనందం వికసిస్తుందని అన్నారు. బాధిత కుటుంబం, క్షమాభిక్షకు అంగీకరించడంతో పదిమంది దోషులకు ఊరట లభించినట్లయ్యింది. ఇండియన్ ఛారిటీ ఆర్గనైజేషన్, సర్బాత్ దా భాలా చారిటబుల్ ట్రస్ట్, ఇప్పటికే బ్లడ్ మనీని న్యాయస్థానంలో బాధిత కుటుంబం కోసం డిపాజిట్ చేసింది. పంజాబ్కి చెందిన 11 మంది వ్యక్తులు, పాకిస్తానీ వ్యక్తితో ఘర్షణ పడటంతో, ఈ ఘర్షణలో పాకిస్తానీ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో నిందితుల తరఫున, బాధితుడి తండ్రిని క్షమాభిక్ష కోరడం, ఆయన క్షమాభిక్షకు అంగీకరించడంతో ఈ కేసులో మరణ శిక్షలు, జైలు శిక్షలుగా మార్చేందుకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..









