విశాఖ మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
- May 27, 2017
తెదేపా 36వ ఏడాదిలోకి అడుగుపెట్టిన యువ పార్టీ అని.. ఏదైనా చేయగల సత్తా తెదేపాకు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు. తొలుత సభికులు, మీడియాకు ఆయన అభివాదం చేశారు. ‘36ఏడాదిలో అడుగుపెట్టిన తెదేపా యుక్త వయస్సులో ఉంది. మహానాడులో పార్టీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉండటాన్ని ఎప్పడూ చూడలేదు. తెలుగు జాతి జరపుకొనే ఏకైక పండుగ మహానాడు. తెలుగు వారి జీవితాల్లో వెలుగుతెచ్చిన పార్టీ తెదేపా. హుద్హుద్ ముప్పు నుంచి బయటపడటానికి నగర వాసులు చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలోని సుందర నగరాల్లో విశాఖ మూడోదిగా నిలిచింది’ అని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పునర్ అంకితం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలుగు వారు గర్వపడేలా పోలవరం నిర్మించుకుందామన్నారు.
తెదేపా అధికారంలో ఉన్నప్పుడు విద్యకు ప్రాధాన్యమిచ్చిందని అన్నారు. ఫలితంగా నేడు తెలుగురాష్ట్రాలు దేశంలో విద్యాపరంగా ముందంజలో ఉన్నాయన్నారు.
రాయలసీమ, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు తెదేపా ప్రాధాన్యమిచ్చిందని అన్నారు. నేటి హైదరాబాద్కు వస్తున్న ఆదాయం నాడు తెదేపా వేసిన పునాది కారణంగానే లభిస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు. జీవితంలో మనం చేసిన పనులే చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









