కింగ్డమ్లో 9 మిలియన్ చెట్ల పెంపకం: రియాద్ గవర్నర్
- May 27, 2017
రియాద్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాటర్ అండ్ అగ్రికల్చర్ ఇనీషియేటివ్లో భాగంగా 1 మిలియన్ ట్రీస్ని రియాద్లో పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తంగా కింగ్డమ్లో 2020 నాటికి 4 మిలియన్ల చెట్లను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా రియాద్లోని ఇమామ్ ముహమ్మద్ బిన్ సౌద్ ప్యాలెస్ కంట్రీయార్డ్ వద్ద ఘాఫ్ ట్రీని నాటారు గవర్నర్ ప్రిన్స్ ఫైసల్. ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియాల్లో లభించే ప్రత్యేకమైన చెట్టు ఘాఫ్. 30 మీటర్ల వరకు ఘాఫ్ ట్రీ వేర్లు భూమిలోకి చొచ్చుకుని వెళతాయి. ఇసుకలో కూడా ఈ చెట్లు పెరుగుతాయి. చెట్ల పెంపకం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేయగలిగినవాళ్ళమవుతామని గవర్నర్ ఫైసల్ బిన్ చెప్పారు. కింగ్డమ్లోని పలు ప్రాంతాల్లో 800,000 మొక్కల్ని నాటనున్నారు. నర్సరీల నుంచి వీటిని సేకరిస్తున్నారు. జుల్ఫి, అల్ గాట్, షక్రా, అల్ ఖర్జ్ల్లోని నర్సరీలు ఈ మొక్కల్ని సరఫరా చేస్తున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









