గాలి నాణ్యతను పెంపొందించేందకు 500 మిలియన్ల దిర్హామ్ లతో పథకం
- May 27, 2017
దుబాయ్: దిర్హామ్స్ గల గలకు ...గాలి నియంత్రణలో ఉండటమే కాదు...మరింత పరిశుభ్రంగా ఉంటుంది. దీనిని నిజం చేస్తూ వాయు ప్రక్షాళన కోసం దుబాయి మున్సిపాలిటీ 2017-2021 మధ్యకాలంలో దుబాయ్ ఎమిరేట్ కోసం వాయు నాణ్యత వ్యూహం (ఎయిర్ క్వాలిటీ స్ట్రాటజీని) ప్రారంభించింది. ఇందు కోసం పలు ప్రణాళికలు, ప్రోత్సాహకాలను ఐదు సంవత్సరాల వ్యవధిలో అంచెలంచెలుగా అమలు చేయనుంది. 2021 నాటికి దుబాయ్ ప్రపంచం లోనే ఉత్తమ నాణ్యత గల వాయువు వీచే నగరంగా స్థాపించాలని అభిలషిస్తోందని గురువారం దుబాయ్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నస్సర్ లూట పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వ్యూహాన్ని తయారుచేసేందుకు ఒక సంవత్సరం నుంచి వ్యూహాలు రచిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క జనరల్ సెక్రటేరియట్ సమన్వయ మరియు సహకారంతో ఆ లక్ష్యాలకు చేరుకొంటామని ఆయన అన్నాడు, దుబాయ్ 2021 ప్రణాళిక యొక్క వ్యూహాత్మక లక్ష్యాలతో తాము ప్రధాన దృష్టిని కేంద్రీకరించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









