ఘర్షణలను అంతం చేయడానికి కృషి చేయాలని కతర్ కోరింది
- May 27, 2017
కతర్: ప్రపంచంలో అంతర్జాతీయ శాంతి,భద్రత సాధించడానికి సాయుధ పోరాటంలో పౌరులను కాపాడేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏదైనా చొరవ చూపితే అందుకు మద్దతునిచ్చేందుకు కతర్ నిలుస్తుందంబి తెలిపింది. భద్రతా మండలిలో పౌరుల రక్షణపై బహిరంగ చర్చలో ఐక్యరాజ్యసమితికి కతర్ యొక్క శాశ్వత ప్రతినిధి రాయబారి షీఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్-థానీ ప్రసంగించారు.సెక్యూరిటీ కౌన్సిల్ స్వీకరించిన తీర్మానం 2286 (2016) మన ప్రాంతంలోని విభేదాలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు, సంఘర్షణలను ఎదుర్కోవడంపై వివరించారు. అలాగే వైద్య రంగం యొక్క పవిత్రతను, వైద్య సిబ్బంది మరియు సౌకర్యాలను అలాగే గాయపడిన మరియు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉద్దేశించిన యు ఎన్ ఎస్ సి రిజల్యూషన్ అమలుకు 2286 (2016) వైద్య వ్యక్తిగత సౌకర్యాలను మరియు సౌకర్యాల లక్ష్యాన్ని చేరుకోవడానికి "అంతర్జాతీయ మానవతా చట్టం యొక్క స్పష్టమైన ఉల్లంఘన గూర్చి చర్చించారు. ఈ సందర్భంలో, ఆమె అటువంటి చర్యల ఫలితంగా వినాశకరమైన ప్రభావం గూర్చి హెచ్చరించింది, ఇది సాయుధ పోరాటంలో పౌరుల బాధలను మరింత తీవ్రతరం చేస్తుందని సూచించారు .సిరియాలో ఆసుపత్రులను సైతం కూల్చి వేస్తున్నారని మరియు ఆరోగ్య సౌకర్యాలను బాధితులకు అందకుండా సిరియాలో కొనసాగుతున్న విధ్వంసంపై ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







