ఘర్షణలను అంతం చేయడానికి కృషి చేయాలని కతర్ కోరింది
- May 27, 2017
కతర్: ప్రపంచంలో అంతర్జాతీయ శాంతి,భద్రత సాధించడానికి సాయుధ పోరాటంలో పౌరులను కాపాడేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏదైనా చొరవ చూపితే అందుకు మద్దతునిచ్చేందుకు కతర్ నిలుస్తుందంబి తెలిపింది. భద్రతా మండలిలో పౌరుల రక్షణపై బహిరంగ చర్చలో ఐక్యరాజ్యసమితికి కతర్ యొక్క శాశ్వత ప్రతినిధి రాయబారి షీఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్-థానీ ప్రసంగించారు.సెక్యూరిటీ కౌన్సిల్ స్వీకరించిన తీర్మానం 2286 (2016) మన ప్రాంతంలోని విభేదాలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు, సంఘర్షణలను ఎదుర్కోవడంపై వివరించారు. అలాగే వైద్య రంగం యొక్క పవిత్రతను, వైద్య సిబ్బంది మరియు సౌకర్యాలను అలాగే గాయపడిన మరియు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉద్దేశించిన యు ఎన్ ఎస్ సి రిజల్యూషన్ అమలుకు 2286 (2016) వైద్య వ్యక్తిగత సౌకర్యాలను మరియు సౌకర్యాల లక్ష్యాన్ని చేరుకోవడానికి "అంతర్జాతీయ మానవతా చట్టం యొక్క స్పష్టమైన ఉల్లంఘన గూర్చి చర్చించారు. ఈ సందర్భంలో, ఆమె అటువంటి చర్యల ఫలితంగా వినాశకరమైన ప్రభావం గూర్చి హెచ్చరించింది, ఇది సాయుధ పోరాటంలో పౌరుల బాధలను మరింత తీవ్రతరం చేస్తుందని సూచించారు .సిరియాలో ఆసుపత్రులను సైతం కూల్చి వేస్తున్నారని మరియు ఆరోగ్య సౌకర్యాలను బాధితులకు అందకుండా సిరియాలో కొనసాగుతున్న విధ్వంసంపై ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









