ఘర్షణలను అంతం చేయడానికి కృషి చేయాలని కతర్ కోరింది
- May 27, 2017
కతర్: ప్రపంచంలో అంతర్జాతీయ శాంతి,భద్రత సాధించడానికి సాయుధ పోరాటంలో పౌరులను కాపాడేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏదైనా చొరవ చూపితే అందుకు మద్దతునిచ్చేందుకు కతర్ నిలుస్తుందంబి తెలిపింది. భద్రతా మండలిలో పౌరుల రక్షణపై బహిరంగ చర్చలో ఐక్యరాజ్యసమితికి కతర్ యొక్క శాశ్వత ప్రతినిధి రాయబారి షీఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్-థానీ ప్రసంగించారు.సెక్యూరిటీ కౌన్సిల్ స్వీకరించిన తీర్మానం 2286 (2016) మన ప్రాంతంలోని విభేదాలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు, సంఘర్షణలను ఎదుర్కోవడంపై వివరించారు. అలాగే వైద్య రంగం యొక్క పవిత్రతను, వైద్య సిబ్బంది మరియు సౌకర్యాలను అలాగే గాయపడిన మరియు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉద్దేశించిన యు ఎన్ ఎస్ సి రిజల్యూషన్ అమలుకు 2286 (2016) వైద్య వ్యక్తిగత సౌకర్యాలను మరియు సౌకర్యాల లక్ష్యాన్ని చేరుకోవడానికి "అంతర్జాతీయ మానవతా చట్టం యొక్క స్పష్టమైన ఉల్లంఘన గూర్చి చర్చించారు. ఈ సందర్భంలో, ఆమె అటువంటి చర్యల ఫలితంగా వినాశకరమైన ప్రభావం గూర్చి హెచ్చరించింది, ఇది సాయుధ పోరాటంలో పౌరుల బాధలను మరింత తీవ్రతరం చేస్తుందని సూచించారు .సిరియాలో ఆసుపత్రులను సైతం కూల్చి వేస్తున్నారని మరియు ఆరోగ్య సౌకర్యాలను బాధితులకు అందకుండా సిరియాలో కొనసాగుతున్న విధ్వంసంపై ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు.
తాజా వార్తలు
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!









