ఘర్షణలను అంతం చేయడానికి కృషి చేయాలని కతర్ కోరింది

- May 27, 2017 , by Maagulf
ఘర్షణలను అంతం చేయడానికి కృషి చేయాలని కతర్ కోరింది

కతర్: ప్రపంచంలో అంతర్జాతీయ శాంతి,భద్రత సాధించడానికి సాయుధ పోరాటంలో పౌరులను కాపాడేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి  ఏదైనా చొరవ చూపితే అందుకు  మద్దతునిచ్చేందుకు కతర్ నిలుస్తుందంబి తెలిపింది. భద్రతా మండలిలో పౌరుల రక్షణపై బహిరంగ చర్చలో  ఐక్యరాజ్యసమితికి కతర్ యొక్క శాశ్వత ప్రతినిధి రాయబారి షీఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్-థానీ ప్రసంగించారు.సెక్యూరిటీ కౌన్సిల్ స్వీకరించిన తీర్మానం 2286 (2016) మన ప్రాంతంలోని విభేదాలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు, సంఘర్షణలను ఎదుర్కోవడంపై వివరించారు. అలాగే వైద్య రంగం యొక్క పవిత్రతను, వైద్య సిబ్బంది మరియు సౌకర్యాలను అలాగే గాయపడిన మరియు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉద్దేశించిన యు ఎన్ ఎస్ సి  రిజల్యూషన్ అమలుకు 2286 (2016) వైద్య వ్యక్తిగత సౌకర్యాలను మరియు సౌకర్యాల లక్ష్యాన్ని చేరుకోవడానికి  "అంతర్జాతీయ మానవతా చట్టం యొక్క స్పష్టమైన ఉల్లంఘన గూర్చి చర్చించారు. ఈ సందర్భంలో, ఆమె అటువంటి చర్యల ఫలితంగా వినాశకరమైన ప్రభావం గూర్చి హెచ్చరించింది, ఇది సాయుధ పోరాటంలో పౌరుల బాధలను మరింత తీవ్రతరం చేస్తుందని సూచించారు .సిరియాలో ఆసుపత్రులను సైతం కూల్చి వేస్తున్నారని   మరియు ఆరోగ్య సౌకర్యాలను బాధితులకు అందకుండా  సిరియాలో కొనసాగుతున్న విధ్వంసంపై  ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com