ఆవు పేడ...గోమూత్ర వాసనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
- May 28, 2017
మనామా: ఆవు పేడ మరియు గోమూత్రం నుండి వచ్చే దుర్వాసనతో మనామలోని స్థానిక నివాసితులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రశాంతంగా ఉండే వారి జీవితాలు ఇలా అశాంతి పాలవడానికి కారణం ఒక ఆవు అంటే ఆశ్చర్యపోక తప్పదు. గత వారం రోజులుగా ఇక్కడ నివాస ప్రాంతంలో ఉండే ఒక రెస్టారెంట్ ముందు కట్టివేయబడి విస్తారంగా పేడను..ధారాళంగా మూత్రాన్ని వెదజల్లుతూ ఈ ప్రాంతాన్ని గొడ్లచావిడిని చేసిందని స్థానికులు వాపోతున్నారు. బంగ్లాదేశీయుడైన రెస్టారెంట్ యజమాని పాలు పితుక్కోవడం మినహా ఆ స్థలాన్ని శుద్ధి చేయడం లేదని...శుభ్రం చేయాలని నివాసితులు పదే పదే కోరుతున్నప్పటికీ ఆ యజమాని ఏమాత్రం స్పందించడం లేదని వారు పేర్కొంటున్నారు. దీనితో ఆ ప్రాంతం దుర్వాసనతో గుప్పుమంటుంది. నిత్యం ఆవుపెదాలను పోగు చేసి ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోవడంతో, ఆవు మూత్రం ..పేడలు మరియు ఇతర వ్యర్థాలు కలగలిపి ఈ ప్రాంతంలో గబ్బువాసనతో స్థానికుల ముక్కుపుటలు అదిరిపోతున్నాయి. ఆ సమీపంలో నడవడానికి కూడా అనాగ్యకరమైన వాతావరణం నెలకొందని నివాసితులు ఆరోపిస్తున్నారు. మనామాలో బ్లాక్ నంబర్ 302, రహదారి సంఖ్య 213, నివాసితుల ప్రకారం, ఆజ్ హబీబ్, బాంగ్లాదేశ్ రెస్టారెంట్ యజమాని. మొత్తం ఈ ప్రాంతంలో అనారోగ్య పరిస్థితులు కల్గించడంతో భయంకరమైన దుర్వాసన వెదజల్ల బడుతుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







