బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తమ్ముడితో రొమాన్స్ కు రెడీ అంటోన్న శ్రీదేవి కూతురు
- June 01, 2017
మరాఠీలో కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో రిలీజై.. వంద కోట్లను వసూలు చేసిన సినిమాగా 'సైరత్' రికార్డ్ నెలకొల్పిన సంగతి విధితమే.. ఈ సినిమా నూతన నటీనటులైన ఆకాష్ తోసర్, రింకూ రాజ్ గుర లు హీరో హీరోయిన్లు గా నటించారు. చక్కటి ప్రేమకధా చిత్రం గా నిలిచిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొన్నది. ఈ నేపద్యంలో సైరత్ ను వివిధ బాషల్లో రీమేక్ చెయ్యడానికి అప్పటి నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి.. కాగా ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ దక్కించుకొన్నాడు.. కాగా ఈ 'సైరత్' ద్వారా వెండి తెరపై అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు "జాహ్నవి " తెరం గ్రేటం చేయనున్నట్లు బీ టౌన్ టాక్.. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.. బద్రీగానాథ్ కీ దుల్హనియా'తో బ్లాక్ బస్టర్ కొట్టిన శశాంక్ ఖేతాన్ సైరత్ కు దర్శకత్వం వహించనున్నారు.. కాగా జాహ్నవి ఎంట్రీ పై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







