బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తమ్ముడితో రొమాన్స్ కు రెడీ అంటోన్న శ్రీదేవి కూతురు
- June 01, 2017
మరాఠీలో కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో రిలీజై.. వంద కోట్లను వసూలు చేసిన సినిమాగా 'సైరత్' రికార్డ్ నెలకొల్పిన సంగతి విధితమే.. ఈ సినిమా నూతన నటీనటులైన ఆకాష్ తోసర్, రింకూ రాజ్ గుర లు హీరో హీరోయిన్లు గా నటించారు. చక్కటి ప్రేమకధా చిత్రం గా నిలిచిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొన్నది. ఈ నేపద్యంలో సైరత్ ను వివిధ బాషల్లో రీమేక్ చెయ్యడానికి అప్పటి నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి.. కాగా ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ దక్కించుకొన్నాడు.. కాగా ఈ 'సైరత్' ద్వారా వెండి తెరపై అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు "జాహ్నవి " తెరం గ్రేటం చేయనున్నట్లు బీ టౌన్ టాక్.. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.. బద్రీగానాథ్ కీ దుల్హనియా'తో బ్లాక్ బస్టర్ కొట్టిన శశాంక్ ఖేతాన్ సైరత్ కు దర్శకత్వం వహించనున్నారు.. కాగా జాహ్నవి ఎంట్రీ పై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









