బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తమ్ముడితో రొమాన్స్ కు రెడీ అంటోన్న శ్రీదేవి కూతురు
- June 01, 2017
మరాఠీలో కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో రిలీజై.. వంద కోట్లను వసూలు చేసిన సినిమాగా 'సైరత్' రికార్డ్ నెలకొల్పిన సంగతి విధితమే.. ఈ సినిమా నూతన నటీనటులైన ఆకాష్ తోసర్, రింకూ రాజ్ గుర లు హీరో హీరోయిన్లు గా నటించారు. చక్కటి ప్రేమకధా చిత్రం గా నిలిచిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొన్నది. ఈ నేపద్యంలో సైరత్ ను వివిధ బాషల్లో రీమేక్ చెయ్యడానికి అప్పటి నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి.. కాగా ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ దక్కించుకొన్నాడు.. కాగా ఈ 'సైరత్' ద్వారా వెండి తెరపై అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు "జాహ్నవి " తెరం గ్రేటం చేయనున్నట్లు బీ టౌన్ టాక్.. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.. బద్రీగానాథ్ కీ దుల్హనియా'తో బ్లాక్ బస్టర్ కొట్టిన శశాంక్ ఖేతాన్ సైరత్ కు దర్శకత్వం వహించనున్నారు.. కాగా జాహ్నవి ఎంట్రీ పై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









