హైదరాబాద్ లో దారుణం కార్టూన్‌ ఛానల్‌ చూసి ఒంటికి నిప్పంటించుకున్న12 ఏళ్ల బాలుడు

- June 02, 2017 , by Maagulf
హైదరాబాద్ లో దారుణం కార్టూన్‌ ఛానల్‌ చూసి ఒంటికి నిప్పంటించుకున్న12 ఏళ్ల బాలుడు

కార్టూన్‌ ఛానల్‌ చూసి ఓ బాలుడు ఒంటికి నిప్పంటించుకుని మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ బాలాపూర్‌ ఠాణా పరిధిలోని వెంకటాపురంలో జరిగింది. జియాగూడాకు చెందిన జయదీప్‌ అనే 12 ఏళ్ల  బాలుడు ఐదేళ్లుగా వెంకటాపురంలోని తన తాతగారి ఇంట్లో ఉంటూ ఐదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఓ టీవీలో  కార్టూన్‌ ఛానల్‌ చూస్తుండగా అందులోని కొన్ని బొమ్మలు పెట్రోల్‌  పోసుకుని దహనమవుతోన్న దృశ్యాలు  వస్తున్నాయి. మంటల్లో కూడా అవి సంతోషంగా ఎగురుతున్నాయి. దీన్నిస్పూర్తిగా తీసుకున్న ఆ బాలుడు తానూ అలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా డాబా పైకెళ్లి కిరోసిన్‌ ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. అంతేకాకుండా .. నా శరీరంపై వస్తున్న మంటలు చూడండి అంటూ తన తాతయ్య, అమ్మమ్మలకు వినపడేట్టు గట్టిగా అరిచాడు. 
తీవ్ర దిగ్భాంతికి గురైన బాలుడి తాతయ్య,అమ్మమ్మ.. మంటలు ఆర్పి చికిత్స కోసం వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.అప్పటికే 70 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com