హైదరాబాద్ లో దారుణం కార్టూన్ ఛానల్ చూసి ఒంటికి నిప్పంటించుకున్న12 ఏళ్ల బాలుడు
- June 02, 2017
కార్టూన్ ఛానల్ చూసి ఓ బాలుడు ఒంటికి నిప్పంటించుకుని మృతి చెందిన ఘటన హైదరాబాద్ బాలాపూర్ ఠాణా పరిధిలోని వెంకటాపురంలో జరిగింది. జియాగూడాకు చెందిన జయదీప్ అనే 12 ఏళ్ల బాలుడు ఐదేళ్లుగా వెంకటాపురంలోని తన తాతగారి ఇంట్లో ఉంటూ ఐదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఓ టీవీలో కార్టూన్ ఛానల్ చూస్తుండగా అందులోని కొన్ని బొమ్మలు పెట్రోల్ పోసుకుని దహనమవుతోన్న దృశ్యాలు వస్తున్నాయి. మంటల్లో కూడా అవి సంతోషంగా ఎగురుతున్నాయి. దీన్నిస్పూర్తిగా తీసుకున్న ఆ బాలుడు తానూ అలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా డాబా పైకెళ్లి కిరోసిన్ ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. అంతేకాకుండా .. నా శరీరంపై వస్తున్న మంటలు చూడండి అంటూ తన తాతయ్య, అమ్మమ్మలకు వినపడేట్టు గట్టిగా అరిచాడు.
తీవ్ర దిగ్భాంతికి గురైన బాలుడి తాతయ్య,అమ్మమ్మ.. మంటలు ఆర్పి చికిత్స కోసం వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.అప్పటికే 70 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









