హైదరాబాద్ లో దారుణం కార్టూన్ ఛానల్ చూసి ఒంటికి నిప్పంటించుకున్న12 ఏళ్ల బాలుడు
- June 02, 2017
కార్టూన్ ఛానల్ చూసి ఓ బాలుడు ఒంటికి నిప్పంటించుకుని మృతి చెందిన ఘటన హైదరాబాద్ బాలాపూర్ ఠాణా పరిధిలోని వెంకటాపురంలో జరిగింది. జియాగూడాకు చెందిన జయదీప్ అనే 12 ఏళ్ల బాలుడు ఐదేళ్లుగా వెంకటాపురంలోని తన తాతగారి ఇంట్లో ఉంటూ ఐదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఓ టీవీలో కార్టూన్ ఛానల్ చూస్తుండగా అందులోని కొన్ని బొమ్మలు పెట్రోల్ పోసుకుని దహనమవుతోన్న దృశ్యాలు వస్తున్నాయి. మంటల్లో కూడా అవి సంతోషంగా ఎగురుతున్నాయి. దీన్నిస్పూర్తిగా తీసుకున్న ఆ బాలుడు తానూ అలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా డాబా పైకెళ్లి కిరోసిన్ ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. అంతేకాకుండా .. నా శరీరంపై వస్తున్న మంటలు చూడండి అంటూ తన తాతయ్య, అమ్మమ్మలకు వినపడేట్టు గట్టిగా అరిచాడు.
తీవ్ర దిగ్భాంతికి గురైన బాలుడి తాతయ్య,అమ్మమ్మ.. మంటలు ఆర్పి చికిత్స కోసం వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.అప్పటికే 70 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
తాజా వార్తలు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!
- పునరాలోచన చేయండి..షురా కౌన్సిల్ కు ప్రభుత్వం విజ్ఞప్తి..!!









