ఎ టి ఎం దోపిడీ యత్నం ..నిఘా కెమెరాలో నిందితుని ఆచూకీ
- June 04, 2017
మనామ:తీగ ..లాగితే , డొంక అంత కదిలిన తీరులో ఎ టి ఎం దోపిడీ యత్నంకు పాల్పడిన నిందితుడిని ఎంచక్కా పట్టించిన సీసీటీవీ రికార్డ్ చేసిన సమాచారంకు పోలీసులు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు., పోలీసులు ఎ టి ఎం దోపిడీకి యత్నించిన వ్యక్తి యొక్క కారు రిజిస్ట్రేషన్ నంబర్ ను ఉపయోగించి ఆ నిందితుడిని పట్టుకొన్నారు, బుసాటీన్ లోని ఒక ఎటిఎం ను పగలకొట్టి దోపిడీకి పాల్పడే ప్రయత్నంలో విఫలమైన అనుమానితుడు ఒక ఆసియా వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ అనుమానితుడు, ఎటిఎం లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాలపై నల్లని రంగు పెయింట్ చిమ్మిన నేరస్థుడు ఎటువంటి ఆధారాలు లేకుండా చేసెనని సంబరపడ్డాడు. ఎటిఎం ను పగలకొట్టే ప్రక్రియలో ఆ యంత్రాన్ని కూడా పాడుచేశాడు. ఈ దొంగతనం గూర్చి నేర పరిశోధకులు ఎటిఎం సమీపంలోని వివిధ మార్గాలలో కూడళ్ల లలో ఏర్పాటుచేసిన వేరే ఇతర సిసి టీవీ కెమెరాల ఫుటేజ్ ను స్కానింగ్ చేసి క్షుణంగా పరిశీలించారు. ఎటిఎం చోరీకి పాల్పడిన నిందితుడిని అతనికి చెందిన కారుని గుర్తించగలిగారు, ముహర్రాక్ పోలీస్ డైరెక్టరేట్, కెప్టెన్ యూసఫ్ ముల్లా బాకీత్ ఈ కేసుపై దర్యాప్తు జరిపారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









