బాహుబలి నిర్మాతలు తర్వాత సినిమా శర్వా లాంటి క్రేజీ హీరోతో
- June 04, 2017
బాహుబలి సినిమాతో తమ సినిమా ప్యాషన్ ఏంటో చూపించారు నిర్మాతలు శోభు, ప్రసాద్ లు తమ తర్వాత సినిమాకు సన్నద్ధం అవుతున్నారు. బాహుబలి లాంటి భారీ రేంజ్ సినిమా తీశాక ఇప్పుడు వారు ఎలాంటి సినిమా తీస్తారన్న దాని మీద ఆడియెన్స్ దృష్టి ఉంది. దాదాపు 1650 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేసిన బాహుబలి మూవీ నిర్మాతలు తమ తర్వాత ప్రాజెక్ట్ శర్వానంద్ హీరోగా చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను ప్రకాశ్ కోవెలమూడి డైరెక్ట్ చేస్తారని టాక్. ప్రస్తుతం చర్చల దశల్లో ఉన్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలో రాబోతుంది. శతమానం భవతి తో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ రీసెంట్ గా వచ్చిన రాధ సినిమాతో వెనుకపడ్డాడు. ఇక ప్రకాశ్ కోవెలమూడితో ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడట శర్వానంద్.
బాహుబలి తర్వాత మేకర్స్ చేస్తున్న సినిమాగా ఆర్కా మీడియా నుండి వస్తున్న ఈ ప్రాజెక్ట్ సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంటుంది. శర్వా లాంటి క్రేజీ హీరోతో ఆర్కా మీడియా చేసే ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు తమిళ హిందిల్లో కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. చిన్న సినిమాతో మొదలైన ఆర్కా మీడియా ప్రస్థానం బాహుబలి లాంటి సినిమా చేశారు.
రాబోతున్న శర్వానంద్ సినిమా కూడా లిమిటెడ్ బడ్జెట్ తోనే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి టాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ అవుతుంది.
తాజా వార్తలు
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!









