ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు కె.సి.ఆర్ ను ఆహ్వానించనున్న బాబు

- October 10, 2015 , by Maagulf
ఆంధ్రప్రదేశ్  రాజధాని శంకుస్థాపనకు కె.సి.ఆర్ ను ఆహ్వానించనున్న బాబు

ఈ నెల 22న జరుగనున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి' శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును తానే స్వయంగా ఆహ్వానిస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. స్వయంగా తాను కేసీఆర్ ను కలిసి ఆహ్వానం అందజేస్తానని చంద్రబాబు మంత్రులకు తెలిపారు. 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా హాజరుకానున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఆహ్వానానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com